చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి.. అయితే డ్రైనేజీ నీటితో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.. వివరాల్లోకి వెళితే.. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మైసమ్మగూడకు వెళ్లేదారిలో ఉన్న నీళ్ల చెరువు గత వర్షాకాలతో నిం డింది. దీంతో గ్రామ మత్స్యకారులు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన 50 వేలు.. మరో 2 లక్షల వరకు చేపపిల్లలు చెరువులో పోసుకున్నారు. కాగా.. మం గళవారం ఉదయం పెద్ద ఎత్తున చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతూ ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. సమాచారం అందుకున్న మత్స్యకారులు ఘటనా స్థలానికి వెళ్లి, పరిశీలించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న చేపలు.. అమ్ముకునే సమయంలో మృత్యువాత పడటంతో ఆం దోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ.. చెరువుకు వెళ్లే దారిలో ఒక ఇండ్ల నిర్మాణ సంస్థ కూలీల కోసం తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసింద ని.. ఈ నివాసాల్లో వందల సంఖ్యలో కార్మికులు ఉంటున్నారని.. వారు వదిలే డ్రైనేజీ నీరు చెరువులో చేరడంతో చేపలు చనిపోయినట్లు వారు ఆరోపించారు. తమకు దాదాపు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే తామెలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. అనుమతి లేకుండా డ్రైనేజీ నీటిని చెరువులోకి వదులున్న నిర్మాణ సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు చైర్పర్సన్, అధికారులను కోరారు. చేపల మృతిపై బుధవారం మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.
శామీర్పేట మండలం, కొల్తూర్ గ్రామ పరిధిలోని చింతలకుంట చెరువులో మంగళవారం చేపలు మృతి చెందాయి.. తుర్కపల్లి పారిశ్రామిక వాడలోని కొన్ని కంపెనీల నుంచి వస్తున్న కలుషితనీరు, విష రసాయన పదార్థాలతోనే చేపలు మృతి చెందాయని గ్రామ ముదిరాజ్ సంఘం, మత్స్యకార సంఘం సభ్యులు ఆరోపించారు. సుమారుగా రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ఈ కుంటలోకి కలుషితనీరు, రసాయనాలను వదిలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కొండ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొక్కొండ నర్సింహలు, ఉపాధ్యక్షుడు నర్సింహ కోశాధికారి సదా మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.