హాలియా, జూలై 7 : అనుముల మండలంలోని మదారిగూడెం, పేరూరు, కొరివేనుగూడెం చల్మారెడ్డిగూడెం, కొట్టాల, నాయుడుపాలెం గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. మదారిగూడెంలో ఎంపీపీ పేర్ల సుమతీపురుషోత్తం పాల్గొన్నారు. త్రిపురారం మండల కేంద్రంతో పాటు నీలాయిగూడెం, కుంకుడుచెట్టుతండా, సత్యంపాడు తండా, కంపాలపల్లి, కంపాసాగర్ గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేశారు. గుర్రంపోడు మండలం ఊట్లపల్లి, సుల్తాన్పురం, మక్కపల్లి, ఎల్లమేనిగూడెం గ్రామాల్లో అంతర్గత రోడ్లకు ఏర్పడిన గుంతలను పూడ్చారు. నిడమనూరు మండల కేంద్రంతో పాటు వెనిగండ్ల, బంకాపురం గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లను గ్రామస్తులు శ్రమదానంతో తొలగించారు. పురాతన భవనాలను తొలగించారు. తిరుమలగిరి సాగర్ మండలంలోని పెద్దబావితండా, శ్రీరాంపురం గ్రామాల్లో రోడ్డు వెంట ఉన్న చెత్తను తొలగించారు. మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ పాండమ్మ, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, సుధాకర్, షేక్ షాహిన్ మధార్షా, ఏఓ పార్వతీ చౌహాన్ పాల్గొన్నారు.
నందికొండ 3వ వార్డులో కౌన్సిలర్ నాగశిరీష రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలగింపజేశారు. 12 వార్డులో మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి స్తంభాలు ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు. 1,5 వార్డుల్లో కౌన్సిలర్లు రమేశ్జీ, మంగ్తా పారిశుధ్య పనులు,7వ, 9వ వార్డుల్లో కౌన్సిలర్లు నిమ్మల ఇందిరాగౌడ్, ఇర్ల రామకృష్ణ చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనూషారెడ్డి, వైస్ చైర్మన్ మందరఘువీర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
దేవరకొండరూరల్ : మండలంలోని మర్రిచెట్టు తండాలో ఎంపీడీఓ రామకృష్ణశర్మ పల్లెప్రగతి పనులను పరిశీలించారు. డంపింగ్యార్డు, వైకుంఠధామం, శానిటైజేషన్, ఇంకుడుగుంతలు, ఎవెన్యూప్లాంటేషన్ను చూసి పలు సూచనలు అందించారు. సర్పంచులఫోరం మండలాధ్యక్షుడు శ్రీనునాయక్, ఎంపీఓ సీవీఎన్ రావు, ఏపీఓ రామచంద్రయ్య, కార్యదర్శి సిరిచందన పాల్గొన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో..
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని 23,39,40,41 వార్డుల్లో మురుగు కాల్వలను శుభ్రం చేశారు. మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న పనులను పరిశీలించారు. వేములపల్లి మండలం శెట్టిపాలెంలో మండల ప్రత్యేకాధికారి మక్బూల్ అహ్మద్ ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి పరిశీలించారు. రావులపెంట, ఆమనగల్లు గ్రామాల్లో ఎంపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మాడ్గులపల్లి మండలంలోని భీమనపల్లి, కల్వెలపాలెం, బొమ్మకల్లు గ్రామాల్లో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డులను మండల ప్రత్యేకాధికారి నాగేశ్వర్రావు పరిశీలించారు. ఎంపీడీఓ జితేందర్రెడ్డి, ఎంపీఓ రవికుమార్, సర్పంచులు మేక లింగమ్మ, గడ్డమీది సైదులు, మారుతి వెంకట్రెడ్డి పాల్గొన్నారు. అడవిదేవులపల్లి మండలంలోని నడిగడ్డ, నల్లమిట్టతండాలో పల్లెప్రగతి పనులను జిల్లా ప్రత్యేకాధికారి జి.నరేంద్రెడ్డి పరిశీలించారు. ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, ఎంపీడీఓ ఎండీ మసూద్ షరీఫ్, ఎంపీఓ లలిత, నోడల్ ఆఫీసర్లు పంకజ్ రెడ్డి, రాధ, సర్పంచులు మేరావత్ సామ్య, ముడావత్ జయలాల్, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, దొంతిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.