కీసర, మార్చి 14 : కీసర బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ నెల 9న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో విజయవంతమయ్యాయి. చివరిరోజు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం లో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రభుత్వ హయాంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. గర్భగుడిలో స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సామూహిక అభిషేకం, ప్రదోషకాలపూజ, హారతి, మంత్రపుష్పం, వసంతోత్సవం, పండితసన్మానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగశాలలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా వేదపండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ ఈవో కట్టా సుధాకర్రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త తటాకం వెంకటేశ్లతో పాటు కీసరగుట్టకు చెందిన వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కీసర సీఐ జె. నరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు కీసరగుట్టలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించామని తెలిపారు. కీసరగుట్ట జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రూ.50లక్షలు మంజూరు చేశారని, మంత్రి చామకూర మల్లారెడ్డి పూర్తి సహకారం అందించారని తెలిపారు. కీసరగుట్ట ఆలయం తరపున జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, మంత్రి మల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది సుధీర్రెడ్డి, జిల్లా యంత్రాంగం, మండలంలోని ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయానికి చెందిన వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పూర్ణాహుతిలో మంత్రి మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జె. సుధాకర్రెడ్డి, కీసర ఎంపీటీసీ నారాయణశర్మ, టీఆర్ఎస్ నేతలు వెంకటేశ్ముదిరాజ్, రామిడి ప్రభాకర్రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మంత్రిని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్రెడ్డి సన్మానించారు.