నల్లగొండ రూరల్, ఏప్రిల్ 26 : నల్లగొండ మండలం దోమలపల్లికి చెందిన నాయకుడు అల్లోజు రాజు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నివాసంలో శుక్రవారం రాజుకు గులాబీ కండువా కప్పి నల్లగొండ బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు నారబోయిన భిక్షం, బడుపుల శంకర్, ఐతగోని విజయ్, నగేశ్ ఉన్నారు.