జైనూర్, ఏప్రిల్ 26 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ని కాలేజ్గూడలో ఐదు మండలాల బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకులకు నిర్వహించిన సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకు, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గడపగడపకూ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సకును భారీ మెజార్టీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు, సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులు, బూత్స్థాయి నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ఆసిఫాబాద్ ప్రాంతానికి మొదటిసారిగా ఎంపీ అవకాశం వచ్చిందని, ప్రజలు ఆలోచించి పార్టీలకతీతంగా తనను ఆశీర్వదిస్తే అభివృద్ధితో పాటు ప్రజా సమస్య లు పరిషరిస్తానని తెలిపారు. ఈ సమావేశం లో వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ యూనుస్ అక్బా నీ, జైనూర్ ఇంద్రవెల్లి మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆత్రం భగవంతరావు, జాదవ్ శ్రీరా మ్ నాయక్, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, నార్నూర్, గాదిగూడ మండలాల, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సహకార చైర్మన్లు పాల్గొన్నారు.