చిన్నకోడూరు, ఏప్రిల్ 15: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సిద్దిపేట రైతులు పోస్టుకార్డు ద్వారా సీఎం రేవంత్రెడ్డికి వినతులు పంపారు. హామీలు అమలు చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, ఉపాధ్యక్షుడు కీసర పాపయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, నాయకులు రవీందర్రెడ్డి, ఉమేశ్చంద్ర మద్దతు ప్రకటించారు.
సిద్దిపేటరూరల్, ఏప్రిల్15: సీఎం రేవంత్రెడ్డి మాగోడు వినాలని రైతులు పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సిద్దిపేట నియోజకవర్గంలోని పత్తి మార్కెట్యార్డులో సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవాపూర్, చిన్నకోడూర్ మండలం పత్తి మార్కెట్లో రైతులు సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా సమస్యలు ఎత్తిచూపారు.
నంగునూరు, ఏప్రిల్ 15: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మండలంలోని రైతులు సీఎం రేవంత్రెడ్డికి పోస్టు కార్డుల ద్వారా ఉత్తరాలు రాశారు. మండల పరిధిలోని సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు రూ.500 బోనస్ ఇచ్చి ఆదుకోవాలని, రైతు రుణమాఫీ రూ.2 లక్షలు చేయాలని, పెంచిన రైతుబంధు రూ.15,000 రైతుల ఖాతాల్లో జమచేయాలని ఉత్తరాల ద్వారా తెలియజేశారు. రైతులకు బీఆర్ఎస్ నంగునూరు మండల నాయకులు మద్దతు తెలిపారు.