భానుడి ప్రతాపంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండలు మండిపోతుండడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు. పండ్లు, రసాలు, ఐస్క్రీమ్లు తీసుకుని, కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు వేసుకుని సేదదీరుతున్నారు.
వివిధ పనుల నిమిత్తం సంగారెడ్డి పట్టణానికి వచ్చి ఎండ బారి నుంచి ఉపశమనం పొందేందుకు శివారులో ఒక చెట్టు కింద ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాన్ని శనివారం ‘నమస్తే’ క్లిక్ మనిపించింది.
– సంగారెడ్డి ఫొటోగ్రాఫర్, మే 27