మెదక్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవపడి క్షణికావేశంలో మనస్థాపానికి గురై పెద్ద శంకరంపేట పట్టణ సమీపంలోని బతుకమ్మ కుంటలో పడి ఓ యువతి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. అల్లాదుర్గం సీఐ జార్జ్, పెద్ద శంకరంపేట ఎస్సై బాలరాజు కథనం ప్రకారం..జిల్లాలోని పెద్ద శంకరంపేటకు చెందిన ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్న ఉబ్బి నాగలక్ష్మి (19) మొహర్రం పండుగ రోజు ఇంట్లో గొడవలు జరగడంతో మనస్థాపానికి గురైందన్నారు.
ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇంటికి రాకపోవడంతో బంధువులందరిని అడిగినప్పటికీ వివరాలు తెలియ రాలేదు. సోమవారం ఉదయం చూసేసరికి బతుకమ్మ కుంటలో నాగలక్ష్మి శవమై తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.