రామచంద్రాపురం, సెప్టెంబర్ 25: అభివృద్ధికి కేరాఫ్గా భారతీనగర్ డివిజన్ నిలుస్తున్నది. డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా డివిజన్లోని ప్రధానంగా రోడ్ల విస్తరణ పనులు చేపట్టి రవాణా వ్యవస్థను మెరుగుపర్చారు. థీమ్పార్కు, మోడల్ రైతుబజార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వార్డు కార్యాలయం ప్రారంభమై వార్డు సేవలు ప్రజలకు అందుతున్నాయి. డివిజన్లో వందశాతం ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. వార్డు వ్యవస్థ ప్రారంభమవ్వగానే అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. స్వయంగా ప్రజలు వార్డు కార్యాలయానికి వచ్చి సమస్యలను అధికారులకు విన్నవిస్తున్నారు. కొందరు ఆన్లైన్లో కూడా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. వార్డు సేవలు చేరువకావడంతో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారమవుతున్నాయి. కాలనీల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడంలో కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి సక్సెస్ అయ్యారు. డివిజన్ కార్పొరేటర్ ఎప్పటికప్పుడు డివిజన్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించుకొని సమస్యలను పరిష్కరిస్తున్నారు. భారతీనగర్ డివిజన్లో ఇప్పటివరకు రూ.93.55కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. ఇటీవల సీఎం కేసీఆర్ పటాన్చెరుకు వచ్చిన సందర్భంగా భారతీనగర్ డివిజన్కు రూ.10కోట్లు నిధులు మంజూరు చేశారు. అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తున్నది. పట్టణాల నుంచి గ్రామాల వరకు సమానంగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధిని ప్రజలు బీఆర్ఎస్ హయాంలో చూస్తున్నారు. ప్రజలకు ఎక్కడ కూడా కష్టం రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అడిగిందే తడవుగా నిధులను మంజూరు చేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారతీనగర్ డివిజన్లో బొంబాయికాలనీ, ఎల్ఐజీ, బీడీఎల్ కాలనీ1,2, మ్యాక్సొసైటీ కాలనీ1,2, హెచ్ఐజీ, ఓల్డ్ ఎంఐజీ, న్యూ ఎంఐజీ కాలనీలు ఉన్నాయి. ఆయా కాలనీల్లో కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి నేతృత్వంలో రూ.93.55 కోట్లతో అభివృద్ధి జరిగింది. డివిజన్లో ప్రధానంగా మోడల్ రైతుబజార్, థీమ్ పార్కు పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. డివిజన్లోని ప్రతి కాలనీలో రోడ్ల అభివృద్ధికి ఇప్పటివరకు రూ.40 కోట్లు, అంతర్గత డ్రైనేజీ పైప్లైన్ల పునరుద్ధరణకు రూ.13 కోట్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు రూ.3.42 కోట్లు, కాలనీల్లో ప్రహరీ నిర్మాణాలకు రూ.2.27కోట్లు, మోడల్ రైతుబజార్ నిర్మాణానికి రూ.5.10 కోట్లు, థీమ్ పార్కుకు రూ.2 కోట్లు, మనబస్తీ మనబడికి రూ.కోటి, వార్డు కార్యాలయ నిర్మాణానికి రూ.1.18 కోట్లు, వాటర్ ప్లాంట్, బోర్వెల్స్, వాటర్డ్రైన్స్, కల్వర్ట్స్, ప్రీక్యాస్ట్ స్లాబ్స్, విద్యుత్పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్, చైన్లింక్ మెష్, పార్కులు, పబ్లిక్ టాయిలెట్లు, సీసీ కెమెరాలు, సీనియర్ సిటిజన్ భవనం, మహిళా భవనానికి సుమారుగా రూ.10 కోట్లు, ఓపెన్జిమ్స్కు రూ.48లక్షలు, ఐమాస్ట్ లైట్లకు రూ.10 లక్షలు ఖర్చు చేయగా రోడ్ల అభివృద్ధికి ఇటీవల రూ.5కోట్లు మంజూరయ్యాయి.
భారతీనగర్ డివిజన్లో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.10కోట్లతో మిషన్భగీరథ పనులు చేపట్టారు. ఆయా కాలనీల్లో నూతన తాగునీటి పైప్లైన్లు వేసి నీటిని సరఫరా చేస్తున్నారు. 30 ఏండ్ల కింద వేసిన తాగునీటి పైప్లైన్లు పాడైపోయి కలుషిత నీరు సరఫరా అవుతుంది. ఆ సమస్యను మంత్రి హరీశ్రావు దృష్టికి కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి తీసుకెళ్లి రూ.10కోట్లు మంజూరు చేయించి నూతన పైప్లైన్ పనులను చేపట్టారు. దీంతో డివిజన్లోని ఆయా కాలనీల్లో కలుషిత నీటి సమస్య పరిష్కారమైంది. ప్రతి ఇంటికీ గ్రావిటి ప్రకారం నీటి సరఫరా అవుతుంది. ఒక్కో ఇంటికి 20వేల లీటర్ల వరకు ప్రభుత్వం తాగునీటిని ఉచితంగా అందజేస్తుంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారతీనగర్ డివిజన్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. ప్రతి సమస్యనూ పరిష్కరిస్తున్నాం. నిత్యం అధికారులను సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. డివిజన్లో ప్రధానంగా మోడల్ రైతుబజార్, థీమ్ పార్కు పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రతికాలనీలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ పైప్లైన్లను పునరుద్ధరిస్తున్నాం. నూతన తాగునీటి పైప్లైన్లను వేసి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ఇప్పటివరకు డివిజన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ సహకారంతో డివిజన్ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నాం.
భారతీనగర్ డివిజన్లో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. డివిజన్ అంతా సుందరంగా మారింది. ఎక్కడికి వెళ్లినా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు బాగా జరిగాయి. కార్పొరేటర్కి సమస్యలు చెప్పిన వెంటనే పరిష్కారమవుతున్నాయి. మ్యాక్ సొసైటీ కాలనీ మరింత అభివృద్ధి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చూడని అభివృద్ధిని చేసి చూపిస్తుంది. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఎంతో మేలు చేస్తుంది.