బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. పుల్కల్ మండలం బస్వాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సంగారెడ్డి జిల్లా జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో తొమ్మిదేండ్లుగా ఎంతో అభివృద్ధి చేస్తున్నప్పటికీ కండ్లుండి చూడలేని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఏ పల్లెకు వెళ్లినా ఖాళీ బిందెలు, కాలిపోయిన మోటార్లు, ఎండిన పంటలతో నిరసన తెలిపేవారిని, బీఆర్ఎస్ వచ్చాక అలాంటి ఘటనలు ఒక్కటి కూడా జరుగలేదని జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ అన్నారు.
– అందోల్, మే 9
జిన్నారం, మే 9: దేశానికే ఆదర్శంగా రాష్ట్రం లో గ్రామాల అభివృద్ధి జరుగుతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామపంచాయతీల అవార్డుల్లో 38 శాతం తెలంగాణకు దక్కడమే నిదర్శనం అన్నారు. మంగళవారం మండల కేంద్రం జిన్నారంతో పాటు అండూరు, మంగంపేట, సోలక్పల్లి, జంగంపేట, వావిలాల, ఖాజీపల్లి, నల్తూరు, కొడకంచి, మాదారం గ్రామా ల్లో రూ.2 కోట్ల 5లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్, స్థానిక నాయకులో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నల్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన పల్లెప్రగతి, పట్టణప్రగతితో గ్రామా లు పట్టణాల రూపురేఖలే మారిపోయాయన్నారు. మిషన్ భగీరథతో తాగునీటి ఇబ్బందులు తొలిగిపోయాయన్నారు. 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును అందిస్తూ వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో ఖాజీపల్లి గ్రామంలో త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. జిన్నారంలో గాంధీ వీధిలో మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. జిన్నారం గ్రామానికి చెందిన వడ్ల హన్మంత్చారి ఇటీవల తన కాలు కోల్పోయాడు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటేశంగౌడ్, సర్పంచ్లు ఖదీర్, శ్రీకాంత్రెడ్డి, ప్రశాంతినరేందర్, కొరివి ఆంజనేయులు, ప్రకాశ్చారి, లావణ్య, వెంకటయ్య, చిట్ల సత్యనారాయణ, జనార్దన్, చెట్టి శివరాజ్, సరితసురేందర్గౌడ్, ఎంపీటీసీలు స్వాతిప్రభాకర్రెడ్డి, లావణ్యనరేశ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ఐకేపీ ఏపీఎం నరేందర్, మాజీ సర్పంచ్లు రాములుయాదవ్, వెంకట్రాంరెడ్డి, ఆకులమమతనవీన్కుమార్, మల్లేశ్, శివరాజ్, ఉపసర్పంచ్ సంజీవ, మల్లేశ్, రమేశ్, నక్క నాగరాజు, మమత పెంటేశ్, నాయకులు గద్దెనర్సింహా, ఆకుల కిరణ్, సాయిభరత్, గణేశ్, ఆంజనేయులు, ఈవోలు పాల్గొన్నారు.