ఉమ్మడి పాలకుల వివక్షకు నిలువెత్తు సాక్ష్యం జహీరాబాద్ నియోజకవర్గం. ఒకప్పుడు కనీస సౌకర్యాలు లేక వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతం తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తుండడంతో పల్లెలు, పట్టణాలు ప్రగతిబాట పట్టాయి. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇక్కడి ప్రజలకు వరంలా మారాయి. రూ.112 కోట్లతో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసిన, ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధ తాగునీరు అందిస్తున్నది. 1,03,259 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సంగమేశ్వర ఎత్తిపోతలను రూ. 2,653 కోట్లతో నిర్మిస్తున్నది. పారిశ్రామిక రంగానికి ఊతమిస్త్తూ ‘నేషనల్ ఇన్వెస్టిమెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్’ను ఏర్పాటు చేయడంతో ఇప్పటికే పలు కంపెనీలు సర్కార్తో ఒప్పందం చేసుకోగా, మరికొన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. 1060 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేసింది. హైవేపై రూ.90 కోట్లతో రైల్వే ఓవర్ను అందుబాటులోకి తీసుకురానున్నది. జహీరాబాద్, కోహీర్, మిర్జాపూర్(బి)ల్లో కొత్తగా సర్కారు దవాఖానలు నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. జహీరాబాద్ మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ రూ. 50 కోట్లు మంజూరు చేయగా, ప్రజలకు మరిన్ని మౌలిక వసతులు సమకూరనున్నాయి.
జహీరాబాద్, మార్చి 24: స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తొమ్మిదేళ్లలో గ్రామాల రూపురేఖలు మారిపోయిన్నాయి. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు చొరవతో రూపురేఖలు మారిపోతున్నాయి. కోట్లాది రూపాయల నిధులతో గ్రామాలన్నీ ప్రగతి బాట పట్టాయి. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పల్లెలలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అభివృద్ధి సాధించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జహీరాబాద్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గం ప్రజలకు వరంగా మారాయి.
నిరుద్యోగులకు ఉపాధి కలిపించేందుకు ఝరాసంగం, న్యాల్కల్లో నిమ్జ్ ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ చేస్తున్నారు. విద్య, వైద్య, రవాణా, వ్యవసాయనికి సాగునీరు సరఫరా చేసేందుకు సంగమేశ్వర్ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేశారు. జహీరాబాద్, కోహీర్, మిర్జాపూర్ (బి) కొత్తగా సర్కార్ దవాఖానలు నిర్మాణం చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మిషన్ కాకతీయలో చెరువులకు మరమ్మతులు చేసిన వర్షం నీరు నిల్వ చేసి పంటలకు సాగునీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథలో ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారు. పాఠశాల భవనాలు నిర్మాణం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకోనేందుకు గురుకుల పాఠశాలల భవనాలు నిర్మాణం చేసి నాణ్యమైన విద్యాబోధన చేస్తున్నారు. ముస్లిం షాదీఖానా, మినీహౌస్ భవనం నిర్మాణం చేస్తున్నారు. విద్యుత్తు సమస్య పరిష్కారం చేసేందుకు కొత్తగా సబ్స్టేషన్లు నిర్మాణం చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. మిషన్ కాకతీయలో చెరువులకు మరమ్మతులు చేసి వర్షం నీరు నిల్వ చేసి పంటలకు సాగు నీరు సరఫరా చేస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ (బి) గ్రామంలో ఉన్న నారింజా ప్రాజెక్టు గేట్లు, పుడికతీత పనులు చేసి వరదనీరు నిల్వ ఉండేందుకు ప్రభుత్వం కృషి చేసింది.
జహీరాబాద్ నియోజకవర్గంలో 5 మండలాల పరిధిలోని 115 గ్రామాల్లో ఉన్న 1,03,259 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. న్యాల్కల్ మండలం చినిగేపల్లిలో సాగునీటి కాల్వ నిర్మాణానికి 15.30 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. మరియాంపూర్లో 12 ఎకరాలు సేకరణ చేస్తున్నారు. ఝరాసంగం మండలంలోని 10 గ్రామాల్లో కాల్వలు నిర్మాణం చేసేందుకు సర్వే చేశారు. ఏడాకులపల్లి 28.20 ఎకరాలు, చిల్కేపల్లి 27 ఎకరాలు, జీర్లపల్లి 9 ఎకరాలు, దేవరంపల్లి 50 ఎకరాలు, పర్యావరం 23 ఎకరాలు, బోరేగవ్ 40 ఎకరాలు, మర్పల్లి 57 ఎకరాలు, కంబాలపల్లి 8 ఎకరాలు, కప్పాడు 23 ఎకరాలు, గంగాపూర్ 10 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నారు. జహీరాబాద్ మండలంలో 5 గ్రామాల్లో 130 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నారు. కాశీంపూర్ 10 ఎకరాలు, బుచినెల్లి 9 ఎకరాలు, తూంకుంట 23 ఎకరాలు, కొత్తూర్ (బి) 14 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నారు. కోహీర్ మండలంలోని కొత్తూర్ (డి)లో 6 ఎకరాలు, వెంకటాపూర్లో 2 ఎకరాలు, సేకరిస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని హోతి(కే)లో 41 ఎకరాల్లో కాల్వలు, సంపు నిర్మాణం చేస్తున్నారు. సంపు నిర్మాణానికి 8 ఎకరాలు భూ సేకరణ చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కాల్వలు నిర్మాణం చేసేందుకు సర్వే చేసి భూసేకరణ చేస్తున్నది.
జహీరాబాద్ నియోజవర్గంలో ఉన్న పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జహీరాబాద్ మున్సిపల్లోని రహ్మిత్నగర్లో రూ.19 కోట్లు 312 ఇండ్లు నిర్మాణం చేసి అర్హులైన వారికి పంపిణీ చేశారు. హోతి(కే) రూ.44 కోట్లతో 660 ఇండ్లు నిర్మాణం చేసి పేదలకు పంపిణీ చేశారు. కోహీర్ మండలంలోని దిగ్వాల్లో రూ.6 కోట్లు 88 ఇండ్లు నిర్మాణం చేసి అర్హులైన వారికి పంపిణీ చేశారు.
కోహీర్ మండలంలోని వెంకటాపూర్లో 1009 ఎకరాల్లో ఫుట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేస్తున్నది. ఇందులో 250 ఎకరాలు పట్టా భూమి ఉంది. రైతులకు ఎకరానికి రూ.15 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.
జహీరాబాద్ మున్సిపల్లో ప్రతి ఇంటికీ నాణ్యమైన ఫిల్టర్ తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి రూ.23.11 కోట్ల మంజూరు చేసింది. తాగునీటిని సరఫరా చేసేందుకు ట్యాంకులు, పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేసి సింగూర్ నీటిని సరఫరా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికీ తాగునీరు సరఫరా చేసేందుకు మిషన్ భగీరథలో కొత్తగా ట్యాంకులు నిర్మాణం, పైపులైన్లు నిర్మాణం చేసిన ఇంటి ముందుకు నల్లాలు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో రూ. 112 కోట్లతో మిషన్ భగరీథ పనులు చేసి ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారు.
ఝరాసంగం, న్యాల్కల్ మండలంలో ‘నేషనల్ ఇన్వెస్టమెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రైతుల నుంచి 12,680.24 ఎకరాల భూమిని సేకరిస్తున్నది. నిమ్జ్లో 7045 మంది రైతులు భూములు కోల్పోతున్నారు. రైతులకు ఎకరానికి రూ.15 లక్షల చొప్పన ప్రభుత్వం చెల్లిస్తున్నది. 65వ జాతీయ రహదారి నుంచి నేరుగా నిమ్జ్కు వెళ్లేందుకు హుగ్గెల్లి చౌరస్తా నుంచి ఎల్గొయి శివారు వరకు రోడ్డు నిర్మాణంకు 65 ఎకరాల భూసేకరణ చేశారు. నిమ్జ్లో గణేశ్పూర్, హుసెల్లి, గుంజేటి, ముంగ్గి, రూక్మాపూర్, హద్నూర్, న్యాతాబాద్, మామిడ్గి, కల్బేమల్, బసంత్పూర్, మెంటల్కుంట, గంగ్వార్, రేజింతల్, మాల్కాన్పహడ్కు చెందిన గ్రామాల భూములు తీసుకుంటున్నారు.
ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కలిపిస్తున్నది. కర్ణాటకలోని బీదర్కు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగిస్తారు. దీంతో నిజాంపేట-వయా న్యాల్కల్ బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.540 కోట్లు మంజూరు చేసింది. ఈ రోడ్డుకు 161 బీ జాతీయ రహదారిగా గుర్తించారు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేసేందుకు టెండరు వేసి కాంట్రాక్టరుకు పనులు అప్పగించారు.
జాతీయ రహదారిపై రైల్వే గేటు ఉండడంతో రైలు వచ్చే సమయంలో గేటు వేయడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం సర్వే చేసి నాలుగు లైన్ల ఫ్లె ఓవర్ నిర్మాణం చేసేందుకు రూ.90 కోట్లు మంజూరు చేసింది. మంత్రి హరీశ్రావు ఆదేశాలతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
జహీరాబాద్ను ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. నిమ్జ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. నిమ్జ్లో ట్రైటాన్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు 150 ఎకరాలు కేటాయించారు. కంపెనీ రూ.2100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నది. ఈ కంపెనీలో 25 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేస్తారు. లైట్ ఆటో కంపెనీ ఏర్పాటుకు 100 ఎకరాలు కేటాయించగా, రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జర్మనీకి చెందిన కంపెనీ ఆటోమోటివ్ వాహనాల విడిభాగాలు ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ కంపెనీలో 9 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 18 వేల మందికి ఉపాధి లభిస్తుంది. వెమ్ టెక్నాలజీస్ కంపెనీ రూ.1000 కోట్లు పెట్టుబడితో 511 ఎకరాలు అధునాతన రక్షణ ఏరోస్పేస్ పరికరాలు, అంతరిక్ష రంగాల్లో ఉపయోగించే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, 4 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది. మహీంద్రా అండ్ మహీంద్రాలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేసేందుకు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. దీంతో 1000 మందికి ఉపాధి లభిస్తుంది.
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో జాతీయ రహదారిపై డివైడర్లు, రోడ్డు వెడల్పు పనులు చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడంతో పనులు పూర్తి చేశారు. రంజోల్ నుంచి జహీరాబాద్ వరకు డివైడర్లు, రోడ్డు విస్తరణ పనులు చేశారు. పట్టణంలో హిందూ వైకుంఠ ధామం నిర్మాణానికి రూ.1.50 కోట్లతో నిర్మాణం పనులు పూర్తి చేశారు. ఆర్యనగర్లో మురికి కాల్వ నిర్మాణం చేసేందుకు రూ.3 కోట్ల మంజూరు కావడంతో కాల్వ నిర్మాణం చేశారు. ఆదర్శనగర్, ఎన్జీవో కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో పార్కుల్లో సౌకర్యాలు కల్పించేందుకు రూ.40 లక్షలు మంజూరు చేయడంతో పనులు చేశారు. జహీరాబాద్ పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం చేసేందుకు రూ.10.5 కోట్లతో భవనం నిర్మాణం చేసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ జహీరాబాద్ మున్సిపల్కు రూ.50 కోట్లు మంజూరు చేయడంతో రోడ్లు, మురికి కాల్వలు నిర్మాణం చేస్తున్నారు. అంబేద్కర్, లింగాయత్, యాదవ్ సంఘ, బాబు జగ్జీవన్ రావు భవనంతోపాటు పలు కుల సంఘల భవనాలు నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేశారు.
సీఎం కేసీఆర్ జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు కావడంతో సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మాణం జరిగింది. సీఎం కేసీఆర్ జహీరాబాద్ మున్సిపల్కు రూ.50 కోట్లు మంజూరు చేశారు. మున్సిపల్లో చెత్త సేకరించేందుకు కొత్తగా వాహనాలు కొనుగోలు చేశారు. ప్రతిరోజు వార్డులో తడి, పొడి చెత్త సేకరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో జహీరాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన తండాలు గ్రామ పంచాయతీలు ఉండేవి కావు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారు. ప్రతి పల్లెకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు జహీరాబాద్, కోహీర్, మిర్జాపూర్ (బి)లో కొత్తగా సర్కార్ దవాఖానలు నిర్మాణం చేసి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. సంగమేశ్వర్ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి నియోజవర్గంలో ఉన్న ప్రతి ఎకరా వ్యవసాయ భూమికి సాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మిషన్ భగరీథలో ఇంటింటికీ తాగురీరు అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిర్మాణం చేసి విద్యాబోధన చేసేందుకు కృషి సలుపుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. ముస్లిం మైనార్టీల కోసం షాదీఖాన, మినీహౌస్ నిర్మాణం చేస్తున్నాం. నిమ్జ్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం.
-కొనింటి మాణిక్రావు, ఎమ్మెల్యే, జహీరాబాద్