సిద్దిపేట అర్బన్, మార్చి 6: అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి తాగునీటి కొర త రాకుండా చూడాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆదేశించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవో, మిషన్ భగీరథ ఈఈ, డీఈ, ఏఈలతో జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి ఆయన సమావేశం నిర్వహించా రు. మండలాల వారీగా తాగునీటి కొరత గల ప్రాంతాలు, ఎలా ఎదుర్కోవాలో లాంటి విషయాల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో మిషన్ భగీరథపైన ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్లో గ్రామాలు, ము న్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ తాగునీటి కొరత ఉంది, పైల్లైన్ లీకేజీలు, వాటర్ ట్యాంక్ మరమ్మతులు, క్లోరినేషన్ ప్రక్రియతో పాటు దూరంగా ఉన్న నివాసాలకు సైతం తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పీఎం విశ్వకర్మ పథకం, ఎన్ఆర్ఈజీఎస్, ప్రజాపాలన సేవా కేంద్రాలు తదితర వాటిపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జయదేవ్ఆర్యా, జడ్పీ సీఈవో రమేశ్, డీపీవో దేవకీదేవి, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్చారి పాల్గొన్నారు.