అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీశ్రావు మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 7 స్థానాల్లో గెలుపొందామని, నారాయణఖేడ్, మెదక్లో తక్కువ మెజార్టీతో ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్కు జయం, అపజయం కొత్త కాదన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ 11రోజులు ఆమరణ దీక్ష చేస్తే ఢిల్లీ ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిందన్నారు. జహీరాబాద్లో తెలంగాణ కోసం 24గంటలు రాస్తారోకో చేశామని, జైలులో మూడు రోజులు ఉన్నామని గుర్తుచేశారు. సాధించుకున్న తెలంగాణను పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసినా.. ప్రజలు మార్పుకోరుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్కు ఉద్యమాలు కొత్త కాదని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడొద్దన్నారు. వచ్చే పార్లమెంట్, మున్సిపల్, పంచాయతీ, ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని హరీశ్రావు పిలుపునిచ్చారు.
జహీరాబాద్, డిసెంబర్ 12: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ పంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞతా సభకు హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని 7 శాసన సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది.. నారాయణఖేడ్, మెదక్ స్థానాల్లో తక్కువ మెజార్టీతో ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్కు జయాలు, అపజయాలు కొత్త కాదన్నారు. 2 శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీ అని, తెచ్చిన తెలంగాణను పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా జహీరాబాద్లో 24 గంటలు రాస్తారోకో చేశామని, మెదక్ జైళ్లలో మూడు రోజులున్నానని గుర్తుచేశారు. మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశాం. బీఆర్ఎస్కు పదవులు కొత్త కాదన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ 11రోజుల ఆమరణ దీక్ష చేస్తే ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందన్నారు. సాధించిన రాష్ర్టాన్ని అటవీ ఉత్పత్తుల్లో నంబర్ వన్ స్థానంలో నిలిపామన్నారు. సమావేశంలో జహీరాబాద్, సంగారెడ్డి ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్రావు, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్రావు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్, టెలికం బోర్డు సభ్యుడు పవార్ శంకర్నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ సీడీసీ ఉమాకాంత్ పాటిల్, న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు నర్సిములు, వెంకటేశం, తట్టు నారాయణ, శ్రీనివాస్రెడ్డి, నాయకులు గోవర్ధన్రెడ్డి, మంకల్ సుభాశ్, అల్లాడి నర్సిములు, కుద్బొద్దీన్, నర్సింహారెడ్డి, నరేశ్, గోటిగార్పల్లి భూమయ్య, శ్రవంతిరెడ్డి, మా ణ్యమ్మ, మంజూల, అనూషమ్మ పాల్గొన్నారు.
నాయకులు, కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్రావు హామీ ఇచ్చారు. జహీరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే సమాచారం ఇవ్వండి… 2 గంటల్లో మీ వద్దకు వస్తాన్నారు. వచ్చే మున్సిపల్, పంచాయతీ, జిల్లా పరిషత్, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పని చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ శాసన ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేసిందని, ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తామని తెలిపారు. ఒక ఏడాది కాంగ్రెస్ పాలనను చూసి ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. కార్యకర్తలు, నాయకుల కృషితో ఎమ్మెల్యే మాణిక్రావు రెండోసారి విజయం సాధించారన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం వెంట పాడుదామని పిలుపునిచ్చారు. గోదావరి నీళ్లను జహీరాబాద్కు తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసిన నాయకులకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తామని చెప్పారు.