నారాయణపేట రూరల్, ఆగస్టు 6 : పాము కాటుకు గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన సంగీత, గుండప్ప రెండో సంతానం రంజిత్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.
గురువారం తరగతి గదిలో ఉన్న సమయంలో పాము కాటువేసింది. వెంటనే నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించగా.. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు.