మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్న ఉద్యోగులు
నారాయణఖేడ్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
వీఆర్ఏల క్రమబద్ధీకరణ, కులవృత్తులకు ఆర్థిక సాయం చేస్తామని మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సంబురాలు మిన్నంటాయి. వీఆర్ఏలు, కులసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. తమ సేవలను గుర్తించి రెగ్యులరైజ్ చేసినందుకు ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని, ఏన్నో ఏండ్ల కలను నెరవేర్చి తమ కుటుంబాలకు భరోసా కల్పించారని వీఆర్ఏలు ఆనందం వ్యక్తం చేశారు. నారాయణఖేడ్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వీఆర్ఏలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ అన్నారు.
– సంగారెడ్డి/ మెదక్, న్యూస్నెట్వర్క్, మే 19
ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న మండల రెవెన్యూ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిచడంతో శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి మెదక్, సంగారెడ్డి జిల్లాల వీఆర్ఏలు క్షీరాభిషేకం చేశారు. ముందుగా మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడంతో సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు. ఇబ్బందులను గుర్తించిన సీఎం రెగ్యులరైజ్ చేయడంతో తమకు సముచిత గౌరవం కల్పించారన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.