నర్సాపూర్, డిసెంబర్ 8 : శివంపేట మాజీ జడ్పీటీసీ స్వర్గీయ లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం ఈ నెల 13 నుంచి 23 వరకు నర్సాపూర్లో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడారు. వాకిటి లక్ష్మారెడ్డి 60వ జయంతిని పురస్కరించుకొని నిర్వ హిస్తున్న వాలీబాల్ నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్లో నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. పోటీల్లో పాల్గొనేవారు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కో గ్రామం నుంచి ఒక టీమ్కు మాత్రమే అనుమతి ఉందన్నారు.
పోటీల్లో మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతి రూ.35 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాల్గొ బహుమతిగా రూ.5 వేల నగదుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నర్సాపూర్ నియోజకవర్గంలోని క్రీడాకారులు సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ, శివంపేట్ మండలంలోని గోమారం క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ పోటీలను నిర్వహిస్తామన్నారు. నర్సాపూర్ బీవీఆర్ఐటీ కేంద్రంలో నర్సాపూర్, హత్నూరా, చిలిపిచెడ్, కొల్చారం, కౌడిపల్లి మండలాలకు చెందిన క్రీడాకారులు పా ల్గొంటారన్నారు. గోమారం గ్రామంలో శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలానికి చెందిన క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 9912509900, 7386561178 ఫోన్ నంబర్లను సంప్రదించాలని చైర్పర్సన్ సునీతారెడ్డి కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్యంగౌడ్, సర్పంచ్లు శ్రీనివాస్, రవి, సేనాధిపతి, టీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, వెంకటేశ్, షేక్ హుస్సేన్, జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.