న్యాల్కల్, మే 29: వాన కాలం దున్నకాలు షురూ అయ్యాయి. సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు సిద్ధమవుతుండగా, వ్యాపారులు కూడా విక్రయాలకు సిద్ధం చేస్తున్నారు. కాగా, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. నాణ్యమైన, ప్రభుత్వ అనుమతి ఉన్న కంపెనీలకు చెందిన వాటినే కొనుగోలు చేయాలని, లేదంటే మోసపోతారని హెచ్చరిస్తున్నారు. అన్నదాతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందిస్తున్న ప్రత్యేక కథనం..