రామచంద్రాపురం, ఏప్రిల్ 28: పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట అని, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ తీసుకురావాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ముఖ్యకార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 30వ తేదీన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ రావడం ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, నాయకులు లచ్చిరాం, రమేశ్, నర్సింలు, యాదయ్య, కొమురయ్య, ఇంద్రారెడ్డి, బాబ్జీ, నాగరాజు తదితరులు ఉన్నారు.
బొల్లారం, ఏప్రిల్ 28: ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ కోలన్ బాల్ రెడ్డి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ… పూరి జగన్నాథ్ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, కౌన్సిలర్లు వేణుపాల్ రెడ్డి, సాయికిరణ్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, బీరప్ప యాదవ్, నాయకులు యాదిరెడ్డి, జైపాల్ రెడ్డి, రత్నం, విట్టల్ చారి, నబీ, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం, ఏప్రిల్ 28: ఆలయాల్లో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మండలంలోని మాదారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం నిర్వహించిన రేణుక ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో అందరికీ మానసిక ప్రశాంతత అవసరం అన్నారు. తమ దైనందిత జీవితంలో ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలన్నారు. ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆధ్యాత్మికతను పెంచేందుకు నూతన ఆలయాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు వెంకటేశంగౌడ్, మాజీ సర్పంచ్ సురేందర్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్, రాంచందర్గౌడ్, గణేశ్, సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.