గజ్వేల్, అక్టోబర్ 18: సీఎం రేవంత్రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ నాయకులంతా మాటలు చాలించి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ముంపు గ్రామాల నిర్వాసితులు 400మందికి రావాల్సిన రూ.448కోట్లను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్చార్జి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో ముంపు గ్రామాలకు చెందిన 9600మంది బాధితులకు డబుల్ బెడ్రూం ఇం డ్లు, ఓపెన్ ప్లాట్లు, ప్యాకేజీలు అందజేశామన్నారు. మైకుల ముందు మాట్లాడి ప్రజలను అయోమయానికి గురిచేసి అబద్ధాలు మాట్లాడడం కాంగ్రెసోళ్లకు అలవాటైందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేయతనిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అప్పుల ఉబిలోకి నెడుతోందని విమర్శించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మించి కేసీఆర్ సాగు,తాగునీటి కష్టాలు తీర్చారన్నారు.
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. మూసీ సుందరీకరణ పేరు చెప్పి పెద్ద స్కామ్కు కాంగ్రెస్ సర్కారు తెరలేపిందని ఆయన. కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, చేతకాని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. దమ్ముంటే మాజీమంత్రి హరీశ్రావు సవాల్ను స్వీకరించి మల్లన్నసాగర్, కొండపోచమ్మ ముంపు గ్రామాల్లో పర్యటిస్తే వెయ్యి మందితో స్వాగతం పలుకుతామని వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.