హైదరాబాద్ : మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. చెరువులో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు గల్లంతయ్యారు. నర్సాపూర్ మండలం నత్నాయిపల్లిలో ఈ ఘటన జరిగింది. నత్నాయిపల్లి శివారులోని వీరన్నచెరువులో స్నానం చేసేందుకు సాయంత్రం ఇద్దరు వ్యక్తులు దిగారు.
ప్రమాదవశాత్తు నీటమునిగి ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని ప్రకాశం జిల్లా మాలపాడుకు చెందిన వెంగళ్ రావు, కల్యాణ్గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సాయంతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.