మెదక్ మున్సిపాలిటీ, జూన్12: జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారుణులు ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాశం శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు అస్సాంలో నిర్వహించనున్న 17 ఏండ్లలోపు బాలికల జాతీయస్థాయి పుట్బాల్ పోటీలకు నగ్మా, అంజలి ఎంపికైనట్లు పేర్కొన్నారు.
అంజలి సిద్దిపేట పట్టణానికి చెందినది. నగ్మాది సంగారెడ్డి జిల్లా వట్పల్లి గ్రామం. వీరిద్దరు మిట్టపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. జాతీయస్థాయి పోటీలకు నగ్మా, అంజలి ఎంపిక కావడంతో ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు రూపేందర్, గోపాల్, శ్రీనివాస్ తదితరులు వారిని అభినందించారు.