సంగారెడ్డి అర్బన్/ సంగారెడ్డి, జూన్ 28 : ప్రజారోగ్యానికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రభుత్వ దవాఖా నల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఫాకో మిషన్ను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వర్చువల్గా ప్రారంభించారు. టీఎస్హెచ్డీసీ చైర్మన్ ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ పేద ప్రజలందరికీ ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామన్నారు. ఇందుకోసం పది జిల్లాల్లో పాకో మిషన్ని రూ. 3.40 కోట్లతో ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేస్తున్నామ న్నారు. ఫాకో మిషన్ ద్వారా సర్జరీ, మందులు లేకుండా పది నిమిషాల్లో కంటి శుక్లాన్ని తొలిగించవచ్చని, దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని తెలిపారు. ఇదే సర్జరీ కార్పొరేట్ దవా ఖానలో రూ.40 నుంచి రూ.50వేల ఖర్చు అవుతుందన్నా రు. ప్రజలందరికీ ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు.
చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కృషితో ప్రభుత్వ దవాఖానల్లో ఆధునిక వైద్యసేవలు అందు తున్నాయన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కంటి శుక్లాలను తొలిగించడానికి లేజర్ ట్రీట్మెంట్ అందుబా టులో ఉందని తెలిపారు. పాకో మిషన్ ద్వారా సంక్లిష్టమైన నేత్ర చికిత్సలను సులువుగా చేయవచ్చన్నారు. కార్యక్రమం లో ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి, డీఎంయూ డాక్టర్ గాయత్రీదేవి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు నర్సింగరావు, పరశురాం పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని, బక్రీద్ పర్వదినాన్ని శాంతియుతంగా నిర్వహించుకుని సోదరభావాన్ని చాటి చెప్పాలని చేనేత అభివృద్ధ్ది సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగా రెడ్డి పట్టణంలోని ఈద్గా వద్ద బక్రీద్ ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ముస్లిం మతపెద్దలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణం లో హిందువులు, ముస్లింలు పండుగలను సోదరభావంతో నిర్వహించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు నిధులు కేటాయిస్తూ అధికారికం గా నిర్వహిస్తున్నదన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ బు చ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, కౌన్సిలర్లు షేక్ సాబేర్, సోహైల్అలీ, యాకూబ్అలీ, అజ్జు, జడ్పీటీసీ కొండల్రెడ్డి, మైనార్టీసెల్ పట్టణాధ్యక్షుడు అంజాద్, నాయకులు ప్రభాకర్, పాండురంగం, వాజీద్, శ్రావణ్రెడ్డి పాల్గొన్నారు.