ఆడబిడ్డల గోస మీకు తగులుతుంది
మాకు ప్రజలే అధిష్టానం
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి మహాధర్నా
రోడ్డుపై వంటలు.. వర్షంలో నిరసనల హోరు
ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో పనిచేయదని.. ఇక్కడ కేసీఆర్ ఇంజిన్ మాత్రమే నడుస్తదని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే, మరోవైపు కేంద్రం చడీచప్పుడు కాకుండా పెట్రో, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
మెదక్లో మహిళలతో కలిసి నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు
మెదక్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కేసీఆర్ ఇంజిన్ మాత్రమే నడుస్తదని, ప్రధాని మోదీ మ్యాజిక్ పనిచేయదని టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగా ఆడ బిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడారు. హెడ్ పోస్టాఫీస్ వద్ద టెంట్ వేసుకుని కట్టెల పొయ్యిపై వంట చేశారు. ధర్నా నిర్వహించడం తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజ లే మాకు అధిష్ఠానమన్నారు. 2014 లో రూ.410 ఉన్న సిలిండర్ ధర 2022లో రూ.1105 వరకు పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక వైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే మరో వైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం ఘోరమని విమర్శించారు. నల్లధనం తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన మోదీ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు.
ఆడ బిడ్డల ఉసురు తగులుతుంది
గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచడంతో ఆడబిడ్డల ఉసు రు తగులుతుందని ఎమ్మెల్యే అన్నారు. రూ.1105 సిలిండర్ ధర కట్టే స్థితిలో తెలంగాణ ఆడబిడ్డలు లేరన్నారు. యాసంగి పంటను కూడా కొనలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణాకు రావాల్సిన జీఎస్టీ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నా రు. బీజేపీ పాలిస్తున్న 19 రాష్ర్టాల్లో ఎక్కడ కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడని, మోదీ కుట్ర కొద్ది హైదరాబాద్కు వచ్చాడని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, నా ర్సింగి వైస్ ఎంపీపీ సుజాత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృ ష్ణారెడ్డి, వనజ, కిశోర్, లక్ష్మీనారాయణగౌడ్, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, డైరెక్టర్ రాగి చక్రపాణి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సుధాకర్రెడ్డి, మహేందర్రెడ్డి, పట్లోరి రాజు, నాయకులు లింగారెడ్డి, మధుసూదన్రావు, సాయి రాం, సంపత్, మహ్మద్, శ్రీకాంత్, నగేశ్, బానీ, కిరణ్, మధు, బాబాగౌడ్, సాయిరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు.
జిల్లా దవాఖానకు రూ.98 లక్షలు మంజూరు
వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. మెదక్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందుతున్నదన్నారు. జిల్లా కేంద్ర దవాఖానలో 5 డయాలసిస్ బెడ్లు ఉండగా, వాటిని 15కు పెంచినట్లు తెలిపారు. ఐసీయూ కేంద్రాన్నీ ఏర్పాటు చేశామన్నారు. పట్టణ శివారులోని ఎంసీహెచ్ భవనాన్ని ప్రారంభించామని, ఇందులో గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్ర దవాఖానలో మరమ్మతులకు టీఎస్ఎంఎస్ఐడీసీ కింద రూ.98 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రేడియాలజీ, మార్చురీ రూంలు, డ్రైనేజీ, విద్యుత్ మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయన్నారు.
పేటలో గ్యాస్ధరల పెంపునకు నిరసన
రామాయంపేట, జూలై 8: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని రామాయంపేట, నిజాంపేట మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు బండారి మహేందర్రెడ్డి, పరుపాటి సుధాకర్రెడ్డి, ఎంపీపీలు నార్సింపేట భిక్షపతి, దేశెట్టి సిద్దిరాములు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీలు, నాయుకులు కాట్రియాల శాములు, పీఏసీఎస్ చైర్మన్ బాపు రెడ్డి, నంద్యాల బాల్రెడ్డి, వెంకటేశం, మోహన్రెడ్డి, బోయిని స్వామి, లక్ష్మణ్ యాదవ్, రాజేందర్, సుభాశ్, మల్లేశం, మహేశ్, శంకర్, సిద్దిరాంరెడ్డి, నారాయణ, దేవేందర్, ఇమామనియేల్ ఉన్నారు.