నర్సాపూర్ : నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ నర్సాపూర్ పట్టణ పార్టీ కమిటీ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి సమక్షంలో ఆర్థిక మంత్రి హరీశ్రావును ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్రావు కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు రావూఫ్, పట్టణ అధ్యక్షుడు పంబల భిక్షపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకట్, మాణయ్య పాల్గొన్నారు.