హుస్నాబాద్, ఏప్రిల్ 2: సామాజిక ఉద్యమకారుడిగా బహుజనుల హక్కుల కోసం పోరాడిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్కే దక్కుతుందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సర్వాయి పాపన్నగౌడ్ 314వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
చేర్యాల, ఏప్రిల్ 2 : శ్రామిక రాజ్యస్థాపనే సర్వాయి పాపన్నగౌడ్ లక్ష్యమని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్కుమార్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పట్టణంలోని ఎల్లమ్మ గుడి ఆవరణలో సర్వాయి పాపన్న 314వ వర్ధంతిని గుడాల గణేశ్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్, పంచతంత్ర ప్రిన్సిపాల్ దొంతగోని బాలకిషన్, గౌడ సంఘం నాయకులు అంబాల బుచ్చిరాములు, పచ్చిమడ్ల వెంకటయ్య, బొంగోని భాస్కర్, అంబటి గోపాల్, పచ్చిమడ్ల సిద్ధిరాములు, రాజు, రాములు, పరశురాములు, సత్తయ్య, నర్సయ్య,కృష్ణమూర్తి, ఐలయ్య పాల్గొన్నారు.
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 2 : సిద్దిపేట కలెక్టరేట్లో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి నిర్వహించారు. కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కొండపాక(కుకునూరుపల్లి), ఏప్రిల్ 2 : సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని కొండపాక మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు అంబటి బాలచందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈసందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడసంఘం నాయకులు పాల్గొన్నారు.
హుస్నాబాద్, ఏప్రిల్ 2: సర్దార్ సర్వాయి పాపన్న సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పచ్చిమట్ల రవీందర్గౌడ్ అన్నారు. హుస్నాబాద్ పట్టణ శివారులోని గుట్టకింది తాటివనంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం నాయకులు పూదరి రవీందర్గౌడ్, లక్ష్మణ్గౌడ్, శ్రీనివాస్గౌడ్, కోహెడ శ్రీను, పెద్దరవి, కుమార్, రవి, సదానందం పాల్గొన్నారు.