మెదక్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ టర్న్ అవుట్ పెరిగే విధంగా విసృ్తతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, పెండింగ్ ఓటరు దరఖాస్తులు వంటి పలు అంశాలపై ఆయన సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.