రామాయంపేట/ శివ్వంపేట/ కొల్చారం/ చిన్నశంకరంపేట, ఏప్రిల్ 26 : రామాయంపేట మండలకేంద్రంలో బుధవారం నిర్వహించే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని టీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు బండారి మహేందర్రెడ్డి, గజవాడ నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం రామాయంపేట క్యాంపు కార్యాయలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బుధవారం నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ సభకు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. జెండా పండుగకు పార్టీ శ్రేణులు, వివిధ అనుబంధ సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉదయం రామాయంపేటకు చేరుకోవాలని పిలుపునిచ్చారు.
శివ్వంపేట మండలంలోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులకు సీఎం కేసీఆర్ చిత్రపటాలు, పార్టీ జెం డాలు, కండువాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమసారథి, టీఆర్ఎస్ అధినేత పార్టీని స్థాపించి 21 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అన్ని గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలతో సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో సర్పంచ్లు అనూషాఅశోక్గౌడ్, రాజునాయక్, టీఆర్ఎస్ నాయకులు కొడకంచి శ్రీనివాస్గౌడ్, రాజశేఖర్గౌడ్, ముత్యంరెడ్డి, ఆంజనేయులుగౌడ్, రామచందర్గౌడ్, దావూద్ పాల్గొన్నారు.
కొల్చార మండలంలోని ప్రతి గ్రామం లో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ నిర్వహించాలని మండలాధ్యక్షుడు గౌరీశంకర్ కోరారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆదేశాలతో మండలంలోని 21 గ్రామాల్లో బుధవారం ఉదయం 10గంటలకు టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
చిన్నశంకరంపేట మండలంలో జెండా పండుగను భారీ ఎత్తు న నిర్వహించాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు కోరారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆదేశాలతో ఉదయం 9గంటలకు జెండాను ఆవిష్కరించాలని సూచించారు.Today is the