మెదక్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా మెదక్ కలెక్టర్ రాజర్షి షా కోరారు. శనివారం తన చాంబర్లో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకే రకమైన ఫొటోలు, మరణించిన వారు, ఒకే ఓటరు వేర్వేరు చోట్ల నమోదు వంటి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలిగించిన ఓట్లు నియోజకవర్గ స్థాయిలో 2 శాతం, పోలింగ్ బూత్ స్థాయిలో 5 శాతానికి మించి ఉంటే పున:పరిశీలించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. వీటిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిందిగా ఈఆర్ఓలు, బ్లాక్ స్థాయి అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటివి ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో జరిగే ఆవకాశం ఉంటుందన్నారు. అర్హులైన ఏ ఒక ఓటరు జాబితా నుంచి తప్పిపోరాదన్నారు.
పొరపాటుగా అలా తొలిగించినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాల్సిందిగా కోరారు. ఈపీ నిష్పత్తి తకువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఓటరు నమోదుకు యువతను ప్రోత్సహించాలన్నారు. ఏడాదిలో నాలుగుసార్లు ఓటరు నమోదుకు అవకాశముందని, ఈ విషయంలో విసృ్తత ప్రచారం కల్పించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఇక నుంచి తరచూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల నమోదు సవరణల ప్రక్రియపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
చిరునామా మార్పు
ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ప్రవేశించిన ప్రాంతాల్లో ఓటరు చిరునామా మార్పు చేయాలన్నారు. గత ఎన్నికల్లో తకువ శాతం పోలింగ్ అయిన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఓటు ప్రాధాన్యతను వివరించి, ఓటు హకును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. స్వీప్ కూడా కళాజాత, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ల ద్వారా విసృ్తత అవగాహన కార్యక్రమాలు చేపట్టి అర్హులైన ప్రతిఒకరినీ ఆన్లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఏప్రిల్ 30న ఓటరుగా నమోదైన సప్లిమెంటరీ జాబితాను ఆన్లైన్లో చూడొచ్చని రాజకీయ పార్టీలకు సూచించారు.
బ్యాలట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ఫ్యాట్లు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా అని, ఫస్ట్ లెవెల్ చెకింగ్ జూన్ మొదటి వారంలో చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇటీవల నమోదైన 10,673 మంది ఓటర్లకు ఎపిక్ కార్డులను త్వరలో పోస్టు ద్వారా పంపుతామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నుంచి చింతల నర్సింహులు, కాంగ్రెస్ నుంచి ఆంజనేయులు గౌడ్, రమేశ్గౌడ్, సీపీఐ(ఎం) నుంచి మల్లేశం, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, నరేశ్ పాల్గొన్నారు.