చేర్యాల, అక్టోబర్ 20 : తెలంగాణలోని అన్నివర్గాలకు సీఎం కేసీఆర్ మంచి చేస్తున్నారని, బీఆర్ఎస్లోకి ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కదలిరావాలని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని శభాష్గూడెం గ్రామానికి చెందిన సీపీఎం నాయకులు గురువారం రాత్రి జనగామ నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ‘పల్లా’ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని గడగడపకూ సంక్షేమ ఫలాలు అందాయని, రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు, పథకాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతి పథకాన్ని దేశంలోని వివిధ రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవడంతో పాటు అమలు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంపద పెంచి ప్రజలకు పంచుతున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలను ఎక్కడిక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో నాయకులు మ్యారబోయిన శ్రీశైలం, బోదాసు యాదగిరి, కరుణాకర్, శ్రీరాముల రాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నాగపురి సర్పంచ్ బండమీది సంతోషీకరుణాకర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, శభాష్గూడెం సర్పంచ్ బొడ్డు స్వప్నాకిరణ్, ఉపసర్పంచ్ ఎదుల కనకయ్య, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుద్దెటి కనకయ్య, బోదాసు రాజు, భీమనపల్లి జనార్దన్, ప్రజ్ఞాపురం ఉపేందర్, శ్రీరాములు కనకయ్య ఉన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), అక్టోబర్ 20 : మద్దూ రు మండలంలోని సలాఖపూర్ గ్రామంలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవా రం జనగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ మండల నాయకుడు బియ్య రమేశ్తో పాటు 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోశ్కుమార్, వైస్ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ ఎమ్మె ల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ గడ్డపై గులాబీ జెండా ఎగరనున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలే పార్టీని గెలిపించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో తన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు ఐలయ్య, సుందరగిరి పరశురాములుగౌడ్, ఉపసర్పంచ్ తాళ్లపల్లి శ్రీధర్గౌడ్ పాల్గొన్నారు.