నర్సాపూర్/వెల్దుర్తి/చిలిపిచెడ్/శివ్వంపేట, నవంబర్ 29: తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు 2023లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో ఈవీఎంలను, ఎన్నికల సామగ్రిని పోలింగ్ సిబ్బందికి బుధవారం పంపిణీ చేశారు. పంపిణీ చేసిన సామగ్రితో పోలింగ్ సిబ్బంది బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని 8 మండలాల్లో 305 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేయగా, ఈ ఎన్నికల్లో 2,23,593 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణను చేపట్టడానికి 1,220 మంది ఎన్నికల సిబ్బందిని ఎన్నికల కమిషన్ నియమించడం జరిగింది. సుమారు 1,500 మంది పోలీస్ సిబ్బందితో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 30 రూట్లల్లో 60 బస్సులను ఏర్పాటు చేసి ఎన్నికల సామగ్రిని, సిబ్బందిని తరలించారు. ఈ ఎన్నికల విధు ల్లో 30 మంది సెక్టర్ అధికారులు పాల్గొననున్నారు.
* నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ నుంచి బస్సుల్లో బుధవారం సాయంత్రం వెల్దుర్తి, మాసాయిపేట పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో మొత్తం 45 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఒక్కో పోలింగ్ కేంద్రానికి నలుగురు సిబ్బందితో పాటు ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వెల్దుర్తి మండలంలో 21 గ్రామపంచాయతీలకుగాను మొత్తం 33 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఓటర్లల్లో పురుషులు 11,635 మంది, మహిళలు 12,303, ఇతరులు 3 కలిపి మొత్తం 23,941 మంది ఉన్నా రు. మాసాయిపేట మండలంలో మొత్తం 9 గ్రామపంచాయతీల పరిధిలో 12 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఓటర్లల్లో పురుషులు 4,133, మహిళలు 4,403లు కలిపి మొత్తం 8,536 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో పంచాయతీ కార్యదర్శులు అన్ని ఏర్పాట్లు చేశారు.
* నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా శివ్వంపేట మం డలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మండల రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ శ్రీనివాస్చారి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 35,752 ఓటర్లు ఉన్నారని, అందుకు శివ్వంపేట మండలంలో 37, మనోహరాబాద్ మండలంలో 3 గ్రామపంచాయతీలు కలుపుకొని మొత్తం 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలానికి సంబందించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను అన్ని పోలింగ్ బూత్లకు సరఫరా చేశామని, మండలంలో ఎన్నికలను ఏడుగురు పరిశీలకులు పర్యవేక్షించునున్నారని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్లకు దాదాపు 120 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్టు ఎస్సై రవికాంత్రావు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్సై తెలిపారు.
* అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా చిలిపిచెడ్ మండలం, ఆయా గ్రామాలకు ఎన్నికలకు అవసరమైన సామగ్రితో బుధవా రం పోలింగ్ కేంద్రంకు సిబ్బంది చేరుకున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనునట్లు మండల ఎన్నికల అధికారి ముసాధిక్ తెలిపారు. ప్రజలు అందరూ తమ ఓటు హక్కులను ప్రశాంతగా వినియోగించుకోవాలని సూచించారు.