మెదక్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం మెదక్ జిల్లాలో సోమవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 4,49,800 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,14,031 మంది పురుషులు, 2,35,769 మంది మహిళలు ఉన్నారు.
ఇప్పటి వరకు 41,338 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 41,708 మందికి అద్దాలకు ఆర్డర్లు ఇచ్చారు. సోమవారం 96వ రోజు జిల్లా వ్యాప్తంగా ఒక బృందం పాల్గొని 120 మందికి కంటి పరీక్షలు చేసి, ఏడుగురికి కండ్లద్దాలు అందజేశారు. నలుగురికి కంటి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు.