నర్సాపూర్/ చిలిపిచెడ్, మే 1: తెలంగాణలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ దేశ రైతాంగం కోరుకుంటున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డు, పీఏసీఎస్లతో పాటు మండల పరిధిలోని కాగజ్మద్దూర్, నత్నాయిపల్లి, పెద్దచింతకుంట, చిన్నచింతకుంట, అచ్చంపేట్, బ్రాహ్మణపల్లి, తుజాల్పూర్, తిర్మలాపూర్, కాజీపేట్, మంతూర్, రెడ్డిపల్లి, జానకంపేట్, చిప్పల్తుర్తి, జక్కపల్లి, ఆద్మాపూర్, ఇబ్రహీంబాద్ గ్రామాలతోపాటు చిలిపిచెడ్ మండల కేంద్రంతోపాటు సోమక్కపేట, జగ్గంపేట, అజ్జమర్రి, బండపోతుగల్, ఫైజాబాద్, చండూర్, చిట్కుల్ శీలాంపల్లి, గంగారం, బద్రియ తండాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీధర్గుప్తా, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, నర్సాపూర్ ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, జడ్పీటీసీ బాబ్యానాయక్, ఎంపీపీ జ్యోతిసురేశ్నాయక్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సత్యాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు నగేశ్, ఆంజనేయులు గౌడ్, జగదీష్, సర్పంచ్లు బుర్ర సురేశ్, శివకుమార్, జితేందర్రెడ్డి, ఏపీఎం గౌరీశంఖర్ తదితరులు పాల్గొన్నారు. చిలిపిచెడ్ మండలంలోని కార్యక్రమాల్లో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, పీఎసీఎస్ ఇన్చార్జి చైర్మన్ రాంచంద్రారెడ్డి, ఐకేపీ ఏపీఎం ప్రేమలత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభర స్వామి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు షఫీ, రైతు బంధు మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, పీఏసీఎస్ ఏఈవో పోచయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు మాంతప్ప, గోపాల్రెడ్డి, పరశురాంరెడ్డి, మమతాబాబు, ఇస్తారి, మనోహర, అశోక్ గౌడ్, యాదగిరి, శంకర్నాయక్, భిక్షపతినాయక్, రాకేశ్ నాయక్, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, నాయకులు మాణిక్యరెడ్డి, లక్ష్మణ్, విఠల్, వీరాస్వామి, సుధీర్రెడ్డి, తదితరలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, మే డే సందర్భంగా గంగారం గ్రామంలో ఉప సర్పంచ్ సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి బట్టలు పంపిణీ చేశారు.