చిన్నశంకరంపేట,డిసెంబర్20 : భూవివాదంతో తమ్ముడిపై దాడి చేసి అన్నను దారుణంగా హత్య చేసిన ఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిన్నశంకరంపేట మండలం శాలిపేట ఉపసర్పంచ్ ముండ్రాతి ఆంజనేయులు(42) తన అన్న సత్యనారాయణ మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నది. ఈ విషయంపై ఐదు రోజుల క్రితం పెద్దమనుషుల ముందు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఉపసర్పంచ్ ఆంజనేయులు నారుమడికి నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. దీంతో అన్నదమ్ముళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆంజనేయులుపై సత్యనారాయణ ఇనుప రాడ్డుతో తలపై విచక్షణా రహితంగా కొట్టి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు రామాయంపేట సీఐ లక్ష్మీబాబు, చిన్నశంకరంపేట ఎస్సై నారాయణకు చెప్పారు.
దీంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్వాడ్ను రప్పించి వివరాలు సేకరించారు. పోలీసులు మృతదేహా న్ని ట్రాక్టర్లో తరలిస్తుండగా కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకుని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని ఆందోళనకు దిగారు. మృతుడి అన్న సత్యనారాయణతోపాటు అల్లుడు భాను కలిసి హత్య చేశారని ఆరోపించారు. పోలీసులు ఆందోళనకారులను సముదాయించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకుతో నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉప సర్పంచ్గా అందరితో కలుపుగోలుగా ఉండే ఆంజనేయులు హత్యకు గురికావడంతో శాలిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రా మంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.