మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కల్యాణోత్సవాలు నిర్వహించారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాల్లోని ఆలయాలను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎంపీ వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పూలు,పండ్లు, పూజా సామగ్రి కొనుగోళ్లలో దుకాణాలు కిటకిటలాడాయి. ఉపవాసాల నేపథ్యంలో భక్తులు పండ్లను కొనుగోలు చేస్తుండగా, వాపారులు ధరలు ఆమాంతం పెంచేశారు. భజనలు, కీర్తనలు, ఉపవాసదీక్షలతో దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.