హైదరాబాద్ నగరం నడిబొడ్డున సాగరతీరంలో ఆకాశమంత ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడంతో దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి వారి మనసులు ఉప్పొంగాయి. బాబాసాహెబ్కు అసలైన నివాళి ఇదే అంటూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని దళితులు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించిన సచివాలయానికి సైతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయడం దళితులపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనమని కొనియాడారు. దళితబంధు పథకం ద్వారా రూ.10లక్షలు అందజేసి దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అభినందించారు.
– సిద్దిపేట జిల్లా నెట్వర్క్, ఏప్రిల్ 15
హైదరాబాద్లో అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించడంపై జిల్లాలోని దళితులు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు. భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పట్ల నిబద్ధత ఉన్న ఏకైక నాయకుడని కొనియాడారు. దేశంలోనే తెలంగాణలో ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించి దళితుల ఆత్మ గౌరవాన్ని మరింత పెంచారన్నారు. కొత్తగా నిర్మించిన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయడం దళితులపై కేసీఆర్కు ఉన్న అభిమానం, ప్రేమకు నిదర్శమన్నారు. దళితబంధు పథకం ద్వారా రూ.10లక్షలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాడన్నారు. మార్కెట్ కమిటీలు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటా మని దళితులు పేర్కొన్నారు.
– ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, ఏప్రిల్ 15
అంబేద్కర్ విగ్రహావిష్కరణ చారిత్రాత్మక ఘట్టం
కోహెడ, ఏప్రిల్ 15: హైదరాబాద్లో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చారిత్రాత్మక ఘట్టమని దళిత నేత, న్యాయవాది జేరిపోతుల కిరణ్కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, నూతనంగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో మూడు రోజులు పని చేసిన బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు వేల్పుల శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిడిశెట్టి రాజుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు వేముల శ్రీనివాస్, తేలు యాదగిరి, ద్యాగటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సముచిత గౌరవం ఇచ్చారు
హైదరాబాద్ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నూతన సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టి ఆయనకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవం కల్పించారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటారు. ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతుంటే కేంద్రం మాత్రం వెనకాడుతోంది. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంఘం
తరుపున మేం కూడా లేఖను కేంద్రానికి పంపించాం.
– ఏర్పుల శ్రీనివాస్, దళిత రత్న అవార్డు గ్రహీత, ఏఐఎస్ఎస్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిన్నారం
సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు
ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు దళితులే కాకుండా అగ్రవర్ణాల వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధికి భవిష్యత్తులో మరిన్ని పథకాలు, కార్యక్రమాలు తీసుకువస్తారని ఆశిస్తున్నా. ప్రతి దళిత కుటుంబాన్ని అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేయడం చారిత్రాత్మక నిర్ణయం. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా దళిత సంఘాలు వెంటే ఉంటాయి.
– పుర్ర ప్రభాకర్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు, కొల్చారం
అంబేద్కర్ స్ఫూర్తిని చాటిన సీఎం కేసీఆర్
దుబ్బాక, ఏప్రిల్ 15: అంబేద్కర్ మహావిగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించడం హర్ష్షణీయం. అంబేద్కర్ స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. 125 అడుగుల మహా విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలు సీఎం కేసీఆర్ రూపంలో ఆచరణ సాధ్యమవుతున్నాయని చెప్పడంలోఅతిశయోక్తి లేదు. హైదరాబాద్ నడిబోడ్డున అంబేద్కర్ మహా విగ్రహం ఏర్పాటు చేయటమనేది భారతజాతి గర్వపడేలా ఉంది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి మాటల్లో చెప్పలేనిది.
ప్రపంచ మేధావి అంబేద్కర్ విగ్రహాన్ని ఆకాశాన్ని తాకేలా నిర్మించడం సీఎం కేసీఆర్కు ఆయనపై ఉన్న అభిమానానికి నిలువెత్తు నిదర్శనంగా చెపవచ్చు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంతో పాటు తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. తెలంగాణ ప్రభుత్వం భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పినందుకు కేసీఆర్కు ప్రత్యేక అభినందనలు. రాజ్యంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ను ఇంత గొప్పగా గౌరవించిన ఘనత తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్కే దక్కింది. బడగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు.
– బక్కి వెంటకయ్య, డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
చరిత్రలో సువర్ణాధ్యాయం
గజ్వేల్, ఏప్రిల్ 15: చరిత్రలోనే ఎవరూ సహసం చేయని విధంగా హైదరాబాద్లో సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయించడం నిజంగా చరిత్రలో సువర్ణాధ్యాయం. భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ దళితుల పట్ల నిబద్ధత ఉన్న ఏకైక నాయకుడు. దేశంలోనే తెలంగాణలో ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల గౌరవాన్ని మరింత పెంచారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో పాటు స్మృతివనం, మ్యూజియం, జీవిత చరిత్ర అందుబాటులో ఉంచారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అంబేద్కర్ విగ్రహం సమీపంలోనే కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయడం దళితులపై సీఎం కేసీఆర్కు ఉన్న అభిమానం, ప్రేమ కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట సీఎం కేసీఆర్ ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేసి ఎంతో ఆసరాగా నిలిచారు. దళిత సమాజం తలెత్తుకునేలా నేడు సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం.
– దేవీ రవీందర్, రాష్ట్ర దళిత బహుజన శక్తి అధ్యక్షుడు
విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్
హైదరాబాద్ నడిబొడ్డున దేశంలోనే ఆతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్కు ఉన్న విజన్కు నిదర్శనం. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు మార్గదర్శనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు హర్షణీయం. తెలంగాణ బిడ్డగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. పార్లమెంట్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు. కానీ ఎవరూ అడుగకుండానే నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయానికి పేరు పెట్ట్టడం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం. అంబేద్కర్ కలలు కన్న సమాజం సీఎం కేసీఆర్తోనే సాధ్యం. దళిత సాధికారిత..దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి దళితులు సగర్వంగా జీవించేలా చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్.
– మేర్గు మహేశ్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం
అంబేద్కర్పై ప్రేమ కురిపించే నాయకులను చాలా మందిని చూశా కానీ, నిజంగా అంబేద్కర్పై సీఎం కేసీఆర్కు అభిమానం మాత్రం మామూలుగా లేదు. ఒక వ్యక్తిపై అభిమానం ప్రపంచాన్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహావిగ్రహం ఏర్పాటు చేసి ఆవిష్కరించడం సీఎం కేసీఆర్కే సాధ్యమైంది. ముంబయిలో సాక్షాత్తు దేశ ప్రధాని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేసి ఆరేండ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. అతి తొందరలో హైదరాబాద్లో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించడం అంబేద్కర్పై అభిమానాన్ని చెప్పకనే చెబుతుంది. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు అంబేద్కర్ మహావిగ్రహం ఏర్పాటు చేసి ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది. అంబేద్కర్ ఆశయాలు కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి చాలా అవసరం.
– పిన్నింటి రత్నం, కళాకారుడు, అంబేద్కర్ అవార్డు గ్రహీత
అంబేద్కర్ విగ్రహం తెలంగాణకే మణిహారం
హైదరాబాద్లో ఆవిష్కరించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తెలంగాణకు మణిహారంగా నిలిచింది. దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఒకే ఒక్క వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమే. రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల తలరాతలు మారుస్తుండు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న దళితులు నేడు యజమానులుగా మారి ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు.
– దుబాషి సంజీవ్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇలాంటి భారీ విగ్రహం హైదరాబాద్లో ఉండడం హర్షణీయం. ఇలాంటి ఘనచరిత్రను దక్కించుకున్న సీఎం కేసీఆర్ను దేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలు కీర్తిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి విగ్రహాన్ని ఆకాశమంత ఎత్తుకు వెలిగెత్తి చాటి,అందరి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకుని ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్న సీఎం కేసీఆర్కు మరో సారి ధన్యవాదాలు.
– తుడుం శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి, గుమ్మడిదల
అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన
దేశానికే తలమానికంగా అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రారంభించుకోవడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నది. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రత్వం కారణం. అట్టడుగు స్థానంలో ఉన్న దళిత సమాజాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎస్సీల్లో విప్లవాత్మకమైన మార్పునకు సీఎం కేసీఆర్ నాంది పలికారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు అధిక ప్రాధాన్యమిచ్చి రాజ్యాంగ నిర్మాతను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే పయణిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని దళితుల సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారు.
– అనంత నవీన్కుమార్, బీఆర్ఎస్ దళిత యువ నేత, జహీరాబాద్
అంబేద్కర్ ఆశయసాధన దిశగా ..
జగదేవ్పూర్, ఏప్రిల్15: తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయించడం హర్షణీయం. గత ప్రభుత్వాలు బాబా సాహెబ్ అంబేద్కర్ను కేవలం దళితులకు పరిమితం చేశాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి ప్రజల్లో రాజ్యాంగం పట్ల కొత్త నమ్మకాన్ని కలిగించారు. దళిత బంధు పథకం దళితుల్లో ఆర్థిక భరోసా కల్పించింది. దేశం గర్వించేలా, ప్రపంచం అబ్బురపడేలా సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయించడం రాజ్యాంగ నిర్మాతకు కల్పించిన సముచిత గౌరవంగా ప్రజలు భావిస్తున్నారు.
– గడ్డం వెంకటేశ్, టీఎస్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి
దేశానికి దిక్సూచి తెలంగాణ
సిద్దిపేటరూరల్, ఏప్రిల్15: ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అంబేద్కర్ జయంతి రోజు 125 అడుగుల భారీ విగ్రహం ప్రారంభించడం నిజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గర్వకారణం. అనుకున్న సమయానికి అభివృద్ధి పనులు చేయించగల సత్తాఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. పేదలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు, మూడు ఎకరాలు, సాగునీరు, ఉచిత కరెంట్, రైతు బంధు, కల్యాణలక్ష్మి వంటి ఎన్నో పథకాలు అమలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు తెలంగాణకు ఒక ఐకాన్గా మారింది.
– రేణికుంట సత్యం, శాలివాహన సంఘం సిద్దిపేట మండల అధ్యక్షుడు
ఇదే నిజమైన నివాళి
యావత్ దేశం గర్వించే విధంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దళితుల బాగు కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. దళితులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి అణగారిన వర్గాల జీవితాల్లో కాంతులు నింపుతున్నాడు. ఇది విగ్రహం కాదు.. విప్లవం అని దళితుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపారు. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని చూసి దళితులు, ఇతర వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఇదే నిజమైన నివాళి. సచివాలయానికి కూడా అంబేద్కర్ నామకరణం చేయడం శుభపరిణామం. దళితుల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికి నిలిచిపోతాడు.
– పంబల భిక్షపతి, నర్సాపూర్ పట్టణ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు, నర్సాపూర్
దేశానికి తలమానికం
దళితులు తలెత్తుకునేలా 125 అడుగుల డాక్టర్ బీఆర్. అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం చరిత్రలో సువర్ణాధ్యాయం. దేశంలోని దళితులతో పాటు ఇతర వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూ అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన చేసేందుకు సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అంబేద్కర్ అశయాలను అమలు చేస్తున్నారు. దళితబంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు ఆర్థిక సాయం చేస్తుండడంతో ఎంతో మంది ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.
-గొటిగార్పల్లి భూమయ్య, బీఆర్ఎస్ దళిత నేత, జహీరాబాద్
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయించడం సంతోషంగా ఉంది, ఏ ప్రభుత్వం కూడా దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పేరును సచివాలయానికి పెట్టడంతోపాటు అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి చిత్తశుద్ధిని చాటుకుంది. పెద్ద విగ్రహం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– లింగాల లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బెజ్జంకి
చరిత్రలో నిలిచిపోతుంది…
హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 15: హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం చరిత్రలో నిలిచిపోయే రోజు. అణగారిన వర్గాలకు సంక్షేమాన్ని అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందువరుసలో ఉంది. ఇప్పటికే దళితులకు దళితబంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనిగర్వంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక విధానంతో కొత్త ఆలోచనలకు ప్రతిరూపమే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అని సంతోషపడుతున్నాం. ఆర్థికంగా, రాజకీయంగా అణగారిన వర్గాలు ముందుకు వెళ్లాలనే ఆశయంతో సీఎం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం. ప్రపంచ మేధావి అంబేద్కర్ను అనునిత్యం గుర్తించుకునే విధంగా సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు దళితజాతి తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
– సావుల రాజమౌళి, న్యాయవాది, హుస్నాబాద్ టౌన్
ప్రపంచమే హైదరాబాద్ వైపు చూస్తున్నది
వర్గల్, ఏప్రిల్ 15: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం అభినందనీయం. ప్రపంచ మేధావుల్లో అంబేద్కర్ ఒకరు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఇంత వరకు పెద్ద విగ్రహం ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నడిగడ్డపై 125 అడుగుల విగ్రహం ప్రారంభించడం యావత్తు దళితజాతికే కాదు, దేశంలోని దళితకుటుంబాలను గౌరవించినైట్లెంది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ సమాజం ఎన్నడూ మరువదు.
– గమిలిపురం యాదగిరి, అంబేద్కర్ సంఘం మండల కార్యవర్గ సభ్యుడు, సిద్దిపేట జిల్లా
విగ్రహం ఏర్పాటు గొప్ప విషయం
హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఆయన ఆశయాలకు నిలువుటద్ధం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న మంచి నిర్ణయం. అంబేద్కర్ పడ్డ కష్టాలకు ప్రతిఫలం. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలన్నదే ఎస్సీ ఎస్టీలకు దిశానిర్దేశం. సచివాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలను ఆలోచింపచేస్తుంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-గజ్జెల రాజమౌళి, ఉపాధ్యాయుడు కోహెడ