జిన్నారం, ఫిబ్రవరి 26: జాతరలు మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, వాటిని కాపాడుకునేందుకు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. ఆదివారం జిన్నారం పంచాయతీ పెద్దమ్మగూడెం మల్లన్న జాతర, గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లిలోని గాలి పోచమ్మ జాతరలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలు మన తెలంగాణ ప్రత్యేకతను సాధిస్తామన్నారు. నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి, నూతన ఆలయాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తూ తనవంతు సహకారం అందిస్తున్నామన్నారు. కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లాలన్నారు. భక్తిభావాన్ని పెంచుకోవాలన్నారు. ప్రతి రోజు ఉదయం ఏకాగ్రతతో ధ్యానించాలన్నారు. దీంతో మనసు, ఆరోగ్యం రెండు బాగుంటాయన్నారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. జాతరలో నిర్వహించిన అగ్గిగుండాలు, బోనాలు తదితర కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పెద్దమ్మగూడెం, కిష్టయ్యపల్లి జాతరలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్, జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్లు ప్రకాశ్చారి, లావణ్యశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశంగౌడ్, జనాబాయి, ఉపసర్పంచ్ మమతాపెంటేశ్, సంజీవ, గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్గౌడ్, మాజీ ఎంపీటీసీ బాశెట్టిరాజు, మాజీ సర్పంచ్ నీరుడి శ్రీనివాస్, ఊట్ల సర్పంచ్ ఆంజనేయులు, సోలక్పల్లి సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, నాయకులు సార నరేందర్, ప్రభాకర్రెడ్డి, గద్దెనర్సింహ, సింహారెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాస్చారి, ప్రదీప్రాజ్, శ్రీనివాస్యాదవ్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి, ఎంపీపీ రవీందర్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్ పాల్గొన్నారు.