మెదక్, మే 7 (నమస్తే తెలంగాణ): మోసపూరిత కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని హరీశ్రావు అన్నారు. మంగళవారం మెదక్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ రోడ్షో, బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ… ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. మోసపూరిత కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రూ.100 కోట్లతో సేవ చేసేందుకు ముందుకొచ్చిన ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మీ సేవకుడిగా ఉంటా, ఆశీర్వదించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా చేసి 60 ఏండ్ల కలను నెరవేర్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. కేసీఆర్ను తిట్టడం కాదు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ను డిమాండ్ చేశారు.