మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 7: తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ నెల15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి రుసుం లేకుండా విద్యార్థులు ఆధార్కార్డు, ఫొటో, సంతకంతో ఆన్లోన్లో www.tmreistelangana.
cgg.gov.in వెబ్సైట్ లేదా టీఎంఆర్ఈఐఎస్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏమైనా సందేహాలుంటే 040-23437909ను సంప్రదించాలని సూచించారు. మైనార్టీ విద్యార్థులకు ముందుగా, ఇతరులకు డ్రా పద్ధతిలో సీట్లు కేటాయిస్తామని తెలిపారు. టెన్త్ ఉత్తీర్ణత ఆధారంగా ఇంటర్లో సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సీట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.