వెంగళరావునగర్, ఆగస్టు 11: షేక్పేట ఫ్లైఓవర్పై ఏర్పాటు చేసిన వర్షపు నీటి పైపు సోమవారం రాత్రి అకస్మాత్తుగా ఊడి రోడ్డుపై పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడిపై పైపు పడినప్పటికీ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రమాదం తప్పింది.
విషయం తెలుసుకున్న షేక్పేట మాజీ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రోడ్డుపై పడిన పీవీసీ పైప్ను అధికారులు తొలగించి,వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. పైప్లైన్లను పూర్తిగా తనిఖీ చేయాలని రషీద్ అధికారులకు సూచించారు.