ఏండ్ల తరబడి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టా పాసుపుస్తకాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి పాలనలో భూమి హక్కులు కల్పించాలని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోడు రైతుల సమస్య తెలుసుకున్న కేసీఆర్, తెలంగాణ వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి గతేడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోడు భూములకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చించి. 2005కు ముందు నుంచి సాగుచేసుకుంటున్న వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3903 దరఖాస్తులు రాగా, 1127 మందికి, మెదక్ జిల్లాలో 521 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్న 610 మంది లబ్ధిదారులకు పాసుపుస్తకాలు అందనున్నాయి. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో అటవీ, రెవెన్యూ, పంచాయతీ,సర్వేశాఖల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి పారదర్శంగా అర్హులను ఎంపిక చేశారు. నేడు సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పోడు రైతులకు పట్టాల పంపిణీని ప్రారంభించిన అనంతరం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ త్వరలో పంపిణీని చేపట్టనున్నారు.
సంగారెడ్డి జూన్ 29 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని పోడు రైతులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం పోడురైతులకు త్వరలోనే పట్టాలు అందజేయనున్నది. శుక్రవారం సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లా నుంచి పోడురైతులకు పట్టాల పంపిణీ ప్రారంభిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పోడు రైతులకు త్వరలోనే పట్టాలు అందజేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో భూములులేని గిరిజనులు దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అడవుల్లోని ముళ్లపొదలను తొలిగించి, రాళ్లు రప్పలను ఎత్తివేసి అటవీభూములను చదునుచేసుకున్నారు.
సాగుకు యోగ్యమైన భూములుగా మార్చుకొని ఏండ్లుగా పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తరాలు మారినా పోడుభూములపై గిరిజనులకు హక్కులు లభించలేదు. తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలని కోరుతూ ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. తెలంగాణరాష్ట్ర సీఎం కేసీఆర్ పోడు రైతుల గోడు ఆలకించి పోడు రైతులకు భూ హక్కులు కల్పింస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ పోడు రైతులకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలోనూ పోడుభూముల సాగు చేసుకుంటున్న గిరిజనులకు త్వరలోనే పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో పోడుభూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1127 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్న 1808 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు అందజేయనున్నారు. జిల్లా యంత్రాంగం ప్రభు త్వ ఆదేశాల మేరకు పట్టాదారు పాసుపుస్తకాలను సిద్దం చేసింది. త్వరలోనే 1127 మంది గిరిజన లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయనున్నారు. త్వరలో పోడుభూములకు సంబంధించి పట్టాలు పొందనున్న విషయం తెలుసుకున్న గిరిజనులు సీఎం కేసీఆర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నారు.
దశాబ్దాలుగా పోడు సాగు.. జాడలేని పట్టాలు
సంగారెడ్డి జిల్లాలో దశాబ్దాలుగా గిరిజనులు పోడుభూములు సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో అటవీప్రాంతం ఎక్కువగా ఉన్న నారాయణఖేడ్, అందో లు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో గిరిజనులు ఏండ్లుగా పోడుభూములు సాగు చేసుకుంటున్నారు. తాము సాగు చేసుకుంటున్న పోడుభూములపై హక్కులు కల్పించాలని గిరిజనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రె స్, టీడీపీ ప్రభుత్వాలను కోరినా పట్టించుకోలేదు. భూ హక్కుల కోసం గిరిజనులు ఉద్యమించినా నాటి పాలకులు దిగిరాలేదు. దీంతో పోడురైతులు దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది.
తెలంగాణ ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ పోడురైతులకు అండగా నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పోడుభూముల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పోడు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. 2005కు ముందు నుంచి పోడుభూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న పోడు రైతుల వివరాలు సేకరించాలని, సర్వే చేసి పట్టాలు ఇచ్చేందుకు అర్హులైన వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా యంత్రాంగం జిల్లాలోని పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.
2005కు ముందు నుంచి పోడుభూములు సాగు చేస్తున్న రైతుల దరఖాస్తులను స్వీకరించారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3903 దరఖాస్తులు వచ్చాయి. ఝరాసంగం మండలంలో 73 మంది, జహీరాబాద్లో 482, కోహీర్లో 389, మొగుడంపల్లిలో 699, వట్పల్లిలో 300 మంది పోడు భూములకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. చౌటకూరు మండలంలో 36 మంది, హత్నూరలో 378, జిన్నారంలో 172, నారాయణఖేడ్లో 19, సిర్గాపూర్లో 48, కల్హేర్లో 1307 మంది దరఖాస్తులు సమర్పించారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మండల, నియోజవకర్గ, జిల్లా స్థాయిలో అటవీశాఖ, రెవెన్యూ, పంచాయతీ,సర్వేశాఖ అధికారులతో కమిటీలు వేసింది.ఈ కమిటీ సభ్యులు పోడుభూముల రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను గ్రామాలకు వెళ్లి పరిశీలించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి పోడురైతుల్లో పట్టాలు పొందేందుకు అర్హులను గుర్తించారు. ఆర్డీవో నేతృత్వంలోని ప్రత్యేక కమిటీలు పోడు రైతుల అర్హుల జాబితాను సిద్దం చేసి కలెక్టర్కు పంపటం జరిగింది. జిల్లా కలెక్టర్ శరత్ పలుమార్లు రెవెన్యూ, అటవీ, గిరిజన శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి అర్హుల ఎంపికపై చర్చించారు. ఆర్డీవోల నుంచి వచ్చిన అర్హుల జాబితాను క్షు ణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. జిల్లాలో ఎంపికైన పోడురైతుల జాబితా ప్రభుత్వానికి అందజేశారు.
1127 మంది అర్హులు
సంగారెడ్డి జిల్లాలో ఏండ్ల్లుగా పోడుభూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు త్వరలోనే పట్టాలు అందనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు పట్టాలు పొందేందుకు అర్హులైన గిరిజనులను ఎంపిక చేశారు. సంగారెడ్డి జిల్లాలో అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని 1127 మంది పోడు సాగు చేస్తున్న 1127 మంది గిరిజనులకు వారు సాగు చేసుకుంటున్న 1808.07 ఎకరాలకు త్వరలో పట్టాలు అందజేయనున్నారు. అర్హులైన గిరిజన రైతుల పేర్లు, సర్వే నెంబర్లు ఇతర వివరాలతో పట్టాదారు పాసుపుస్తకాలను అధికారులు సిద్ధం చేశారు.
ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే పోడు రైతులకు త్వరలో పట్టాలు అందజేయనున్నారు. ఝరాసంగం మండలంలో ఏడుగురు రైతులకు 19 ఎకరాలు, జహీరాబాద్ మండలంలో 213 మంది రైతులకు 123.57 ఎకరాలకు సంబంధించి పట్టాలు అందజేయనున్నారు. అలాగే కోహీర్ మండలంలో 168 మంది గిరిజన రైతులకు 218.57 ఎకరాలు, మొగుడంపల్లి మండలంలోని 593 మంది గిరిజన రైతులకు 1392.52 ఎకరాలు, వట్పల్లి మండలంలోని 145 మంది రైతులకు 53.16 ఎకరాలు, చౌటకూరు మండలంలోని ఒక లబ్ధిదారునికి 1.25 ఎకరాలకు సంబంధించి పట్టాలు ఇవ్వనున్నారు.
సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం..
పోడు భూముల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. పీచెర్యాగడి పాత తండాలో 85 మందికి, పీచెర్యాగడి కొత్త తండాలో 86 మందికి పట్టా పుస్తకాలు, రైతుబంధు చెక్కులు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా తండాకు చెందిన రైతులకు న్యాయం చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
-తారాబాయి, సర్పంచ్ పీచెర్యాగడి తండా. కోహీర్ మండలం
నాకు ఎకరం భూమి ఉంది..
సేడియగుట్ట తండా శివారులో నాకు ఎకరం భూమి ఉన్నది. నాకు తెలిసి 30 ఏండ్ల నుంచి పంటలను పండిస్తున్నా. ప్రస్తుతం మక్క పంట వేశా. చాలా మంది రైతుల భూములు ఫారెస్ట్ కింద వస్తుందని మాకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. కానీ మంచి మనసు ఉన్న సీఎం కేసీఆర్ సార్ మాకు పట్టాదారు పాసు పుస్తకాలతో పాటు రైతుబంధు చెక్కులను ఇస్తామని చెప్పిందుకు కృతజ్ఞతలు.
-రాజు నాయక్, సేడియగుట్ట తండా రైతు. కోహీర్ మండలం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు. భుములు ఉన్నాయి వాటి మాకు హక్కు లేకుండే సీఎం సారు ఇచ్చిన మాట ప్రకారం పోడు భుములు పట్టాలు అందజేస్తున్నారు. పట్టాలతో ప్రభుత్వం అందించే రైతు బంధు, రైతు భీమా పథకాలతో మాకు లబ్ధిచేకురుతుంది. పోడు పట్టాలు ఇస్తున్నందుకు కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఏ ప్రభు త్వం కూడా మాకు పరిష్కారం చూపలేదు. మన తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపడం సంతోషంగా ఉన్నది.
-డెవ్లా నాయక్, మంచిర్యాల తండా, వట్పల్లి
పట్టాలతో పాటు రైతుబంధు కూడా..
ఎన్నో ఎడ్లుగా భుములను సాగుచేసుకుటున్నాం. గుట్టలగా ఉన్న భుములను పంట పోలాలుగా మార్చుకున్నాం. కానీ భుములు మా పేరు మీద లేకుండే మాకు రైతు బంధు పడకుండే. కేసీఆర్ సారు వచ్చాక మా గురిం చి అలోంచించి మాకు పట్టాలు అందజేస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాటా ప్రకారం మాకు పట్టాలు అందజేస్తారంటా.. మాకు రైతు బంధు, రైతు భీమా వస్తాది. గిరిజనుల గురించి కేసీఆర్ సారు బాగా అలోచించిండు. మా కష్టలకు ప్రతి ఫలం అందించినందుకు రుణపడి ఉంటాం.
-లక్ష్మీబాయి, మంచిర్యాల తండా, వట్పల్లి