సంగారెడ్డి కలెక్టరేట్, మే 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవల కోసం కోట్ల రూపాయాలను ఖర్చు చేసి వసతులను కల్పిస్తున్నదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లాను సందర్శించిన శ్రీనివాసరావు తొలు త ఆర్సీపురం, భానూర్, కంది ప్రాథమిక వైద్య కేంద్రాలను పరిశీలించారు. కంది పీహెచ్సీలో రోగులతో మాట్లా డి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. నాలు గో దశ కరోనా వచ్చే అవకాశం ఉన్నదని ప్రజలు జాగ్రత్త గా ఉండాలని సూచించారు. రెండు డోసులు వేసుకొని 9నెలలు దాటితే బూస్టర్ డోస్ వేసుకోవడం మర్చిపోవద్దని తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో అందించే వైద్య సేవలు ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించాలని చెప్పారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. త్వరలో అన్ని పీహెచ్సీలలో ఆరోగ్య సేవలను విస్తరించనున్నట్టు వెల్లడించారు. అందుకు అన్ని విధాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్యులకు సూచించారు. పీహెచ్సీల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వర్తించాలన్నారు.
కరోనా వ్యాక్సినేషన్ 100శాతం పూర్తి చేయాలి
జిల్లాలో అన్ని కేటగిరీలలో కరోనా వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలని శ్రీనివాసరావు ఆదేశించారు. ఆశ వర్కర్ల నుంచి సూపర్ వైజర్ల వరకు పేద ప్రజలకు సేవలు అందించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నా రు. వైద్యులు ఆయా వైద్య సిబ్బంది అన్ని విధాల మెరుగు పర్చాలని, ఏ ఇండికేటర్లోనైనా వెనుకబడితే దానిపై దృష్టి సారించి పురోగతిని సాధించాలన్నారు. దవాఖాన్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డిప్యూటీ డీఎం అండ్ హెచ్వోలు ప్రతి నెల 15రోజులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆయా విషయాలపై పర్యవేక్షించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. జిల్లా సహజ ప్రసవాల్లో అన్ని పారామీటర్స్లలో బాగుందని డైరెక్టర్ సంతృ ప్తి వ్యక్తం చేశారు.
కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేయిటేజ్
వచ్చే ఒకటి, రెండు వారాల్లో వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ వెలువడుతుందని, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిన పని చేస్తున్న డాక్టర్లకు వెయిటేజ్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది బాగా పనిచేసి మరింత పురోగతి సాధించాలని కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షీ షా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్వోలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
డీహెచ్ను సన్మానించిన టీఎన్జీఓ నాయకులు
సంగారెడ్డి అర్బన్, మే 9: సంగారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్రావును సోమవారం టీఎన్జీవో జిల్లా నాయకుడు మర్యాదపూర్వకంగా కలిసి ఘ నంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుశీల్బాబు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ లో ఎంతోమంది ఉద్యోగస్తుల మెడికల్ రియంబర్స్ మెం ట్, ప్రస్తుతం 317జీవో ప్రకారం ఉద్యోగులకు జరిగిన స్థానచలనం పారదర్శకంగా నిర్వహించి ఉద్యోగుల మన్ననలు పొందారన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, జిల్లా నాయకులు వెంకట్రెడ్డి, శ్రీకాంత్, గౌస్ హాష్మి, శ్రీనివాస్, భాస్క ర్, సుభాష్, నవాజ్, ప్రసన్నకుమార్ ఉన్నారు.
పీహెచ్సీని సందర్శించిన హెల్త్ డైరెక్టర్
రామచంద్రాపురం, మే 9 : ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్నగర్కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రావు సోమవారం తనిఖీ చేశారు. దవాఖానలో రోగులకు అందిస్తున్న సేవలు, స్వచ్ఛత, స్టోర్రూంలో నిలువ ఉన్న మందులు, వ్యాక్సినేషన్ తదితర వివరాలను డాక్టర్ నాగరాజకూమారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల ఎన్ని సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయా అని డాక్టర్ను అడిగారు. అదేవిధంగా దవాఖానకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సాధారణ ప్రసవాలను మాత్రమే ప్రోత్సహించాలని డాక్టర్కు, సిబ్బందికి సూచించారు.