జిల్లాలో మరో రెండు మండలాలు పురుడు పోసుకున్నాయి. 16 గ్రామాలతో కుకునూరుపల్లి, 10 గ్రామాలతో అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ మండల కేంద్రాలుగా ఏర్పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. మండలాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియజేయాలని నోటిఫికే షన్లో స్పష్టంగా పేర్కొంది. ప్రజల ఏండ్ల నాటి కల నెరవేరడంతో ఆయా మండలాల పరిధిలో ఆనంద వాతావరణం నెలకొంది. రెండు మండలా ఏర్పాటుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జిల్లాలో మొత్తం మండలాల సంఖ్య 26కు చేరింది.
సిద్దిపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో మరో రెండు నూతన మండలాలు పురుడు పోసుకున్నాయి. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజల అభీష్ట మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగానే కుకునూర్పల్లి, అక్బర్పేట-భూంపల్లి(ఎక్స్రోడ్)ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. కొత్త మండలాల ఏర్పాటుపై 15 రోజుల వరకు అభ్యంతరాలు, సూచనలను స్వీకరించి, వాటిని పరిష్కరించి తుది ప్రకటన జారీచేయనున్నది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని 16 గ్రామాలతో కుకునూర్పల్లి, దుబ్బాక నియోజకవర్గంలోని 10 గ్రామాలతో అక్బర్పేట-భూంపల్లి చౌరస్తాను మండలాలుగా ఏర్పాటు చేయనున్నది. జిల్లాలో రెండు మండలాలు ఏర్పాటుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. 22మండలాలతో సిద్దిపేట జిల్లాగా ఏర్పడింది. అనంతరం సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేటను ప్రభుత్వం మండలంగా ఏర్పాటు చేసింది. 2020లో జనగామ నియోజకవర్గంలో ధూళిమిట్టను మండలంగా మార్చింది. దీంతో జిల్లాలో మొత్తం 24 మండలాలు కాగా, తాజాగా కుకునూర్పల్లి, అక్బర్పేట-భూంపల్లి(ఎక్స్రోడ్డు) మండలాలను ఏర్పాటు చేయనుండడంతో మొత్తం మండలాల సంఖ్య 26కు చేరనున్నది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ మండలం
సిద్దిపేట డివిజన్ పరిధి దుబ్బాక నియోజకవర్గంలో కొత్త మండలం ఏర్పాటైంది. స్థానిక ప్రజల అభీష్టం మేరకు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మండల ఏర్పాటుకు కృషిచేశారు. అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ను 10 రెవెన్యూ గ్రామాలతో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మండలంలోకి దుబ్బాక మండలంలోని పోతారెడ్డిపేట, చౌదర్పల్లి, ఎనగుర్తి, చిట్టాపూర్, మిరుదొడ్డి మండలంలోని ఖాజీపూర్, కూడవెల్లి, వీరారెడ్డిపల్లి, జంగాపల్లి, అల్మాస్పూర్, భూంపల్లి గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ మండలాన్ని ఏర్పాటు చేసింది. దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, రాయపోల్, తొగుట మెదక్ జిల్లాలోని చేగుంట, నార్సింగ్ మండలాలు ఉన్నాయి.
కుకునూర్పల్లి మండలం..
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో మరో కొత్త మండలం ఏర్పాటవుతున్నది. ఈ నియోజకవర్గంలో గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కూక్, జగదేవ్పూర్, కొండపాక మెదక్ జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాలున్నాయి. తాజాగా కుకునూరుపల్లి మండలాన్ని కొండపాక మండంలోని 11 రెవెన్యూ గ్రామాలు, జగదేవ్పూర్ మండలంలోని 2 రెవెన్యూ గ్రామాలను కలిపి కొత్త మండలంగా ఏర్పాటు చేస్తున్నారు. కొండపాక మండలంలోని కుకునూరుపల్లి, తిమ్మారెడ్డిపల్లి, లకుడారం, మేదినీపూర్, మాత్పల్లి, కోనాయపల్లి, ఎర్రవల్లి, సింగారం, తిప్పారం, ముద్దాపూర్, మంగోల్, జగదేవ్పూర్ మండలంలోని చిన్నకిష్టాపూర్, రాంచంద్రాపూర్, రాయవరం, వెంకటాపూర్, ఎల్లాయగూడ గ్రామాలను కలుపుతూ కుకునూరుపల్లి నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
కుకునూరుపల్లి, అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ మండలాలు ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు మండలాలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అందుకు అనుగుణంగా కొత్త మండలాలు ఏర్పాటవుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నది. ప్రజలు అడగకుండానే అన్ని పనులను సీఎం కేసీఆర్ చేస్తున్నారు. గతంలో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది. ఇవాళ ప్రజలకు ఆ తిప్పలు తప్పాయి. ప్రజల సౌకర్యార్థం కొత్తగా మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
– ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
జిల్లాకు మరింత వన్నె..
మరో రెండు మండలాలు ఏర్పాటు కావడంతో జిల్లాకు మరింత వన్నె వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కొత్త జిల్లాలు, మండలాలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఏర్పడ్డాయి. అక్బర్పేట-భూంపల్లి చౌరస్తా, కుకునూరుపల్లి మండలాల ఏర్పాటులో మంత్రి హరీశ్రావు సహకారంతో మరిచిపోలేనిది. విలీన గ్రామ ప్రజల ఏండ్ల కల టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెరవేరింది. ఇందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. మండల ప్రజలకు శుభాకాంక్షలు.
– టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
చాలా సంతోషంగా ఉంది
కుకునూరుపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాజీవ్ రహదారిపై ఉన్న కుకునూరుపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడంతో ఈ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఇప్పటికే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. మండలానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉండడంతోనే ఇవాళ మండలంగా ఏర్పడింది. ప్రజల పక్షాన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– పోల్కంపల్లి జయంతి నరేందర్, సర్పంచ్, కుకునూరుపల్లి
అందరి సహకారంతోనే..
దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న రోజు ఇది. మండలం కావాలని కలలుగన్న ఎంతో మంది నాయకుల స్వప్నం సాకారమైన సమయమిది. కుకునూరుపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు. మండలం ఏర్పాటుకు సహకరించిన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డికి కృతజ్ఞతలు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలతో కలిసి మండలాన్ని సాధించుకున్నాం. అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే నేడు మండలం సాకారమైంది. కుకునూరుపల్లి మండలంగా ఆవిర్భవించనుండడంతో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది.
– పోల్కంపల్లి నరేందర్, పీఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్, కుకునూరుపల్లి
జిల్లాలో కుకునూరుపల్లి, అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ను రెండు మండలాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కుకునూరుపల్లి మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు, అక్బర్పేట-భూంపల్లిలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నూతన మండలంలోని రెవెన్యూ గ్రామాల వివరాలు ఇలా ఉన్నాయి.