మనోహరాబాద్, అక్టోబర్ 10 : అనుమానస్పద స్థితిలో ఓ యువకుడు ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..రాజస్థాన్ రాష్ట్రం నాగోర్ జిల్లా బాలతాత గ్రామానికి చెందిన సురేశ్ కుమార్ (29) బతుకుదెరువు కోసం మనోహరాబాద్ మండలం కొండాపూర్లో అద్దె ఇంట్లో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
కాగా శనివారం అర్ధరాత్రి అనుమానాస్పదస్థితిలో అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్కు కేబుల్ వైర్తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు పప్పురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు.