పరీక్షల్లో ప్రతి నిమిషమూ ప్రధానమే
ఒత్తిడికి లోనవకుండా చదవాలి
ప్రతి సబ్జెక్ట్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి
అందోల్, మే8: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ప్రతి నిమిషమూ.. ప్రధానమే కావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. పరీక్షలంటే భయపడకుండా ప్రణాళిక ప్రకారం సమయాన్ని అనుసరించేలా టైంటేబుల్ను తయారు చేసుకుని చదువుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉపాధ్యాయుల సహాయంతో ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించి, చదవడంతో పాటు రివిజన్ చేసుకుంటే ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితం
పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో సమయానికి అనుగుణంగా ప్రణాళికతో చదివితే భవిష్యత్తుకు మంచి పునాది పడుతుంది. ప్రతి సబ్జెక్ట్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఏకాగ్రతతో చదవాలి. విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావించే పదో తరగతిలో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఏలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలంటే భయాన్ని విడిచిపెట్టాలి. దిగులు పడుతూ పరీక్షలకు వెళ్లకూడదు. ప్రశాతంగా పరీక్షలకు వెళ్తే బాగా రాసే అవకాశం ఉంటుంది. .
ఇలా చేస్తే మేలు
ఆంగ్లంపై భయం వద్దు
ఇంగ్లిష్ అంటే చాలా మంది భయపడుతుంటారు. విద్యార్థులకు ఇంగ్లిష్పై కనీస పరిజ్ఞానం ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు. విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నాపత్రాలు ఉంటాయి. బేసిక్ ఇంగ్లిష్ నేర్చుకుని గ్రామర్పై పట్టు సాధించి, లాంగ్వేజ్ను అర్థం చేసుకుని రాసేలా విద్యార్థులు సాధన చేయాలి.
– కొండల్, ఎస్ఏ, ఇంగ్లిష్, అందోల్
చిన్న ప్రశ్నలపై దృష్టి సారించాలి
విద్యార్థులు ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను క్షుణ్ణంగా చదివి, అ ర్థం చేసుకుంటే పరీక్ష సులువుగా రాయవ చ్చు. ప్రశ్నలను అవగాహన చేసుకుని రా స్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. చిన్న చిన్న ప్రయోగాలు చేయడంతో మంచి మార్కులు పొందవచ్చు. పెద్ద ప్రశ్నలకు ఆన్సర్ రాస్తూనే చిన్న ప్రశ్నలపై దృష్టి కేంద్రీకరించాలి. – అనిల్, పోసానీపేట్ పాఠశాల, అందోల్
సాధన చేస్తే సులువు
గణిత శాస్ర్తాన్ని రోజూ సాధన చేస్తే మార్కు లు పొందడం చాలా సులువు. ప్రశ్నాపత్రం లో ఇచ్చిన సమాచా రం అవసరమైన ప టాలు గుర్తించి సరిగ్గా రాస్తే మంచి మార్కు లు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి అధ్యాయంలో 3 నుంచి 4 ప్రధాన భావనలుంటాయి. వాటిని బాగా అవగాహన చేసుకుని, ఉదాహరణలు సాధన చేయాలి.
– నరోత్తం, జడ్పీహెచ్ఎస్, జోగిపేట
ఆందోళన చెందవద్దు
విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ప్రశ్నాపత్రాన్ని ఒకటికి.. రెండు సార్లు చదువుకుని, జవాబులు రాయాలి. .తప్పని సరిగా అల్పాహారం తీసుకుని పరీక్షకు వెళ్లితే మంచిది.
– కృష్ణ. మండల విద్యాధికారి. అందోల్