పదో తరగతి పరీక్షలు ప్రారంభం
పరీక్షా కేంద్రాల వద్ద సందడి
జిల్లా వ్యాప్తంగా 14,922 మందికిగానూ
14,864మంది హాజరు
మొదటి రోజు 58మంది విద్యార్థులు గైర్హాజరు
ములుగులో కలెక్టర్ హనుమంతరావు,
హుస్నాబాద్లో డీఈవో తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమ య్యాయి. తొలిరోజు పరీక్షకు 99.61శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 83పరీక్షా కేంద్రాల్లో 14,922 మంది విద్యార్థులకు గానూ 14,864 మంది హాజరుకాగా, 58 మంది గైర్హాజ రయ్యారు. నిమిషం నిబంధన అమలు లేనప్పటికీ విద్యార్థులు సమయం కంటే ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. కరోనా దృష్ట్యా విద్యార్థులు మాస్క్ ధరించి పరీక్షకు హాజరయ్యారు. ములుగులో కలెక్టర్ హనుమంతరావు, హుస్నాబాద్లో డీఈవో తనిఖీ చేశారు.
సిద్దిపేట అర్బన్, మే 23 : జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు 99.61 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆయా పరీక్షా కేంద్రాలు సందడిగా మారాయి. ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షా కేంద్రంలోకి ఉపాధ్యాయులు విద్యార్థులను అనుమతించారు.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 83 పరీక్షా కేంద్రాల్లో 14,922 మంది విద్యార్థులకుగానూ 14,864 మంది హాజరుకాగా 58 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం నిబంధన అమలు లేనప్పటికీ.. విద్యార్థులు సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కరోనా దృష్ట్యా విద్యార్థులు మాస్క్ ధరించి పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పర్యవేక్షణలోనే క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేసి జవాబు పత్రాలు సీజ్ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణను పరిశీలించారు.