పాపన్నపేట, ఏప్రిల్ 2 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మనబడి’ కార్యక్రమం తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యా ర్థులకు కావాల్సిన మౌలిక, కనీస సదుపాయాలు, వసతు లు సమకూరుతున్నాయి. ‘మనఊరు-మనబడి’ భాగంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో సౌర పలకలు ఏర్పాటు చేసి, సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లావ్యాప్తంగా 18 ఉన్నత పాఠశాలల్లో సౌర విద్యు త్ ఉత్పత్తికి ఏర్పాటు పూర్తికావచ్చాయి. ఒక్కొక్క యూనిట్ రూ.1.59 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు బాధ్యతలను రెడ్కో సంస్థకు అప్పగించారు. 2కిలోవాట్స్ సామర్థ్యం ఉన్న సౌర పలకలు ఏర్పాటు చేయగా, ప్రతినెలా 230 యూనిట్ల సౌర విద్యుత్ ను ప్రతి పాఠశాల వాడుకోవచ్చు.
అంతకుమించి వాడితే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి తో పాఠశాలలో విద్యుత్ అంతరాయం సమస్య ఉండదు. సౌర విద్యుత్లో కీలకమైన ఇన్వర్టర్లకు ఐదేండ్ల వారంటీ ఇవ్వగా, ప్యానెల్ బోర్డులకు 25ఏండ్లు వారంటీ ఇస్తున్నట్లు రెడ్కో సంస్థ వెల్లడించింది. పాపన్నపేట మండలంలోని ఆరు ఉన్నత పాఠశాలల్లో సోలార్ ప్యానెల్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాపన్నపేటతోపాటు కుర్తివాడ, చీకోడ్, లింగాయపల్లి, యూసుఫ్పేట, కొత్తపల్లి, కొడుపాక పాఠశాలల్లో సౌర యూనిట్లు ఉన్నాయి. పాపన్నపేట మండలం లోని 6 పాఠశాలలు సోలార్ విద్యుత్తో జిగేల్ మంటున్నాయి. ఇకపై విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణతోపాటు, ప్రొజెక్టర్ ద్వారా విద్యాబోధన చేయడం సులభతరం కానున్నది.
18 పాఠశాలల్లో సోలార్ విద్యుత్
జిల్లా వ్యాప్తంగా 18 పాఠశాలల్లో ‘మన ఊరు-మనబడి’లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ప్రతిరోజూ సుమారు 8 యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన పాఠశాలల్లో సోలార్ ఫిట్టింగ్ పూర్తయింది. పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించాం. అన్ని విజయవంతంగా పని చేస్తున్నాయి.
– రామ్మోహన్రావు, రెడ్కో మేనేజర్, మెదక్ ఉమ్మడి జిల్లా
కరెంట్ బిల్లులు కట్టడం తప్పింది
గతంలో విద్యుత్ బిల్లు భారీగా వచ్చేది, బిల్లు కట్టలేక తీవ్ర ఇ బ్బందులు పడేవాళ్లం. స్కూల్ గ్రాంట్తో పాఠశాలకు సంబంధించిన వస్తువులు కొనడానికే సరిపోయేవి. దీంతో కరెంట్ బిల్లు కట్ట్ట లేని పరిస్థితి. డబ్బులు చాలక ఇబ్బంది పడేవాళ్లం, ప్రస్తుతం సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయడంతో బిల్లు కట్టె బాధ తప్పింది.
– హరిసింగ్, పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు