దుబ్బాక, నవంబర్11 : చెరువులో పడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం దుబ్బాకలో చోటు చేసుకుంది. దుబ్బాక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాక పట్టణంలోని రేపల్లె వాడకు చెందిన బండి పద్మ(48) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.
ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి పద్మ ఇంట్లో కనిపించకోవటంతో ఆమె కుటుంబీకులు బంధువుల వద్ద వెతికారు. లాభం లేకపోవటంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం దుబ్బాక పెద్ద చెరువులో పద్మ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలి భర్త ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ఎస్ఐ స్వామి తెలిపారు.