గజ్వేల్, డిసెంబర్ 13: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని ఆర్థిక,వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో గజ్వేల్కు చెందిన మేర, మోచి, అయ్యర్, ఎరుకల కులసంఘాలతో పాటు, బైక్ మెకానిక్, ఎల్ఐసీ ఏజెంట్లు, హమాలీ, ఆర్టిస్ట్ తదితర 8 సంఘాల భవనాల నిర్మాణాలకు భూములు కేటాయిస్తూ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి,మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్తో కలిసి ఆయా సంఘాల ప్రతినిధులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలన్నారు. కులసంఘాలు, కార్మిక,ఉద్యోగ సంఘాలకు ఏ ప్రభుత్వం కూడా భూములు ఇవ్వలేదని, భవనాలు నిర్మించలేదని, సీఎం కేసీఆర్ ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో పాటు కుల,కార్మిక సంఘాల నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఆర్డీవో విజయేందర్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బెండ మధు, నవాజ్మీరా, పండరి రవీందర్రావు, చంద్రమోహన్రెడ్డి, రాజు పాల్గొన్నారు.