చేర్యాల, జూలై 27 : టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ పార్టీలో బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను దేశంలోని అన్ని రాష్ర్టాలలో ఉన్న పార్టీలు అవలంభిస్తున్నాయన్నారు. పార్టీ పటిష్టత ఓ వైపు, రాష్ట్ర అభివృద్ధి మరో వైపుగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్కు మరింత అండగా ఉండాల్సిన సమయం అసన్నమైందన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, హక్కులు, నిధుల సాధన విషయంలో సీఎం కేసీఆర్ రాజీ పోరాటాం చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అనంతుల మల్లేశం, చేర్యాల ఏఎంసీ డైరెక్టర్, మాజీ సర్పంచ్ వల్లూరి శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అరిగే కనకయ్య, సర్పంచ్ కొండపాక భిక్షపతి, ఎంపీటీసీ యెలికట్టే శివశంకర్, నాయకులు కొండపురం మధు, పొకల ఎధర్, గూడురు పుల్లయ్య, వార్డు సభ్యులు హరీశ్బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.