మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి27 : భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మద్దూరు మండలంలోని ధర్మారంలో చోటు చేసుకుంది. ఎస్సై అన్నెబోయిన నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివరాత్రి గట్టయ్య(57) గత కొంతకాలంగా తాగుడుకు బానిసై భార్య కనకమ్మను కొడుతుండడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లింది.
తాగుడు మానివేయాలని ఎన్నిమార్లు చెప్పినా వినకపోవడంతో ఆమె పుట్టింటి నుంచి గట్టయ్య వద్దకు రావడానికి నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆదివారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.